ఫెడరల్ టూర్స్ అండ్ ట్రావెల్స్..! తేలిపోతున్న కేసీఆర్ ఫ్రంట్..!

ఫెడరల్ ఫ్రంట్ పెట్టి.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి.. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకగా పోరాడతానని కేసీఆర్ ప్రకటించిన కార్యాచరణ కూడా ప్రారంభించారు. కానీ ఈ ఫెడరల్ ఫ్రంట్ రాను రాను కామెడీ అయిపోతోంది. సీరియస్ నెస్ లేకుండా… గంభీరమైన ప్రకటనలే తర్వాత కేసీఆర్ చేస్తున్న మాయాజాలం అన్నట్లు తెలిపోతోంది. దాంతో అసలు కేసీఆర్ ఫ్రంట్ అనేదే లెక్కలోకి ఎవరూ తీసుకోవడం లేదు.

ఫెడరల్ ఫ్రంట్ ప్రకటించిన తర్వాత తనకు మమతాబెనర్జీ, హేమంత్ సోరెన్ ఫోన్ చేశారని కేసీఆర్ హంగామా చేశారు. కానీ తర్వాత తేలిందేమిటంటే.. కేసీఆర్ తరపున ఎంపీ కేకే.. వారికి ఫోన్ చేసి మాట్లాడారు. వారు చూద్దాం.. అని మాట ఇచ్చారు. కానీ అలా అన్న ఒకటి రెండు రోజులకే అటు దీదీ… ఇటు హేమంత్ సోరెన్.. కాంగ్రెస్ తో చర్చలు జరిపేశారు. హేమంత్ సోరెన్ అయితే యూపీఏలో చేరిపోయారు కూడా. కానీ ఆ తర్వాత హేమంత్ సోరెన్ కుటుంబంతో కలిసి షాపింగ్ కి హైదరాబాద్ వస్తే.. తానే ఆతిధ్యం ఇచ్చి… ఫెడరల్ ఫ్రంట్ లో చేరేందుకు ఒప్పించినట్లు వార్తలు పుట్టించారు. కానీ జేఎంఎంకు కాంగ్రెస్ ను వదిలే పరిస్థితి లేదు. అలాగే మమతా బెనర్జీ కూడా. ప్రత్యేక విమానం పెట్టుకుని… కోల్ కతా వెళ్లిన కేసీఆర్ కు…ఆమె.. గట్టి షాకే ఇచ్చారు. కేసీఆర్ చెప్పినది వినడమే తప్ప… ఆమె ఎలాంటి హామీ ఇవ్వలేదు. అలాగే బెంగళూరు వెళ్లినా .. దేవేగౌడ కూడా… మంచి మాటలు … భోజనం పెట్టి పంపించారు తప్ప.. ధర్డ్ ఫ్రంట్ గురించి మాట మాత్రంగా కూడా చెప్పలేదు.

ఇవన్నీ ఇలా ఉండగానే… నవీన్ పట్నాయక్ ధర్డ్ ఫ్రంట్ కోసం చర్చలకు… కేసీఆర్ ను ఆహ్వానించారంటూ.. టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం ప్రారంభించాయి. పత్రికల్లోనూ ప్రాధాన్యం కల్పించారు. కానీ నిజానికి తేలిందేమిటంటే.. కేసీఆర్ పూరి జగన్నాథుని ఆలయ సందర్శనకు వెళ్లనున్నారు. ఎలాగూ వస్తున్నారు కాబట్టి.. సంప్రదాయంగా కేసీఆర్ కలుస్తారని… ఒరిస్సా ప్రభుత్వానికి తెలంగాణ అధికారులు సమాచారం ఇచ్చారు. దానికి నవీన్ పట్నాయక్ సరే అన్నారట. దానికే..ధర్డ్ ఫ్రంట్ కలరింగ్ ఇచ్చి ప్రచారం చేసేసుకున్నారు.. టీఆర్ఎస్ నేతలు. ఇలాంటి చేష్టల వల్లే సీతారాం ఏచూరీ ఫెడరల్ ఫ్రంట్ ను మూసితో పోల్చారు.

ఇలాంటి కబుర్లు… సామాన్య ప్రజలకు చెప్పడానికి బాగుంటాయేమో కానీ.. .నిజాలు తెలిసిన తర్వాత మాత్రం..టీఆర్ఎస్, కేసీఆర్ సిన్సియారిటీని..సీరియస్ నెస్ ను… ప్రమాదంలోకి నెట్టేస్తాయి. ప్రస్తుతం అదే జరుగుతోంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కామెడీ అయిపోయింది. తప్ప.. ఒక్కరంటే. ఒక్కరైనా… ఆసక్తి చూపిస్తారని ఎవరూ నమ్మడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close