మీడియాపై పవన్ రివర్స్ ఎటాక్.. ! చానళ్లపై కేసులు..!

మీడియాతో డైరక్ట్ వార్ కు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. తన త్లలిని దూషించడం వెనుక మీడియా సంస్థలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్న పవన్ కల్యాణ్… వాటిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్ … ట్వీట్లు, పవన్ ఫ్యాన్స్ మీడియా పై దాడి చేయడం తదితర ఘటనలతో… ఒక్క సారిగా వాతావరణం అంతా వవన్ వర్సెస్ మీడియా అన్నట్లుగా మారిపోయింది. టీవీ నైన్ యజమాని శ్రీనిరాజు, ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ వేర్వేరుగా క్రిమినల్ కేసులు, పరువు నష్టం కేసులు దాఖలు చేస్తున్నారు. దీంతో పవన్ కల్యాణ్ కూడా.. న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు వేసిన కేసులలో వాదించడం కాకుండా.. తాను కూడా రివర్స్ కేసులేశారు. స్వయంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తన న్యాయవాదులతో కలసి వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు.

శుక్రవారం ఫిల్మ్ చాంబర్ లో …ఆందోళనకు దిగిన పవన్ కల్యాణ్ కు… ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు, ఇండస్ట్రీ పెద్దలు సర్ది చెప్పి పంపిచేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్… శ్రీరెడ్డికి సలహా ఇచ్చినట్లుగా తనకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కు వెళ్లాలి కానీ.. ఆందోళనలు చేయడం.. మీడియాలో కవరేజ్ వచ్చేలా హడావుడి చేయడమేమిటన్న విమర్శలు వచ్చాయి. దాంతో పవన్ కల్యాణ్.. ఫిల్మ్ చాంబర్ నుంచి నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్లి… జనసేన న్యాయవిభాగం ప్రతినిధిలతో సమావేశమయ్యారు. రెండు రోజులుగా వారితో చర్చలు జరిపారు. మీడియాపై ఏ విధంగా కేసులు వేయవచ్చో… చర్చోపచర్చలు జరిపారు. లాయర్ల సూచనలు, సలహాల మేరకు… ఆయన తన కంప్లైంట్ ను పోలీసులకు ఇచ్చారు.

పవన్ కల్యాణ్ … ట్వీట్లు, పవన్ ఫ్యాన్స్ మీడియా పై దాడి చేయడం తదితర ఘటనలతో… ఒక్క సారిగా వాతావరణం అంతా వవన్ వర్సెస్ మీడియా అన్నట్లుగా మారిపోయింది. టీవీ నైన్ యజమాని శ్రీనిరాజు ఇప్పటికే లీగల్ నోటీసులకు పవన్ కల్యాణ్ కు పంపారు. వాటిని పవన్ స్వయంగా ట్విట్టర్ లో పెట్టారు. శ్రీనిరాజు, వేమూరి రాధాకృష్ణ వేసిన కేసులలో వాదించడం కాకుండా.. తాను కూడా రివర్స్ కేసులేయాని నిర్ణయించుకున్నారు. అయితే మీడియాపై కేసులు పెట్టాలన్న పవన్ కల్యాణ్ నిర్ణయంపై విస్మయం వ్యక్తమవుతోంది. వార్తలను చూపించడమే తప్పన్నట్లుగా పవన్ కల్యాణ్… పోలీసులకు ఫిర్యాదు చేయడంపై మీడియా వర్గాలు కూడా.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. మీడియాలో ఏమైనా తప్పులు వస్తే.. ప్రెస్ కౌన్సిల్ లాంటి సంస్థలకు ఫిర్యాదులు చేయాలి పోలీసుల వద్దకు వెళ్లడమేమిటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీడియా ఎంతగా తనపై దుష్ప్రచారం చేస్తున్నా..తనెందుకు ఇంకా సహనంతో ఉండాలని ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close