బీజేపీకి “పవర్” బ్యాచ్ టెన్షన్..! పార్టీలో ఉంచేదెలా..?

భారతీయ జనతాపార్టీలో ఇప్పుడు “పవర్” బ్యాచ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పవర్ బ్యాంచ్ అంటే ఎవరో కాదు.. గత ఎన్నికల ముందో..తర్వాతో..బీజేపీ అధికారంలోకి వస్తుందని భావించి ఆ పార్టీలో చేరిన వాళ్లు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అస్థిత్వం పూర్తిగా కనుమరుగవడంతో… ఆ పార్టీలోని చాలా మంది నేతలు.. వైసీపీలోకి వెళ్లిపోయారు. కొద్ది మంది నేతలు.. మాత్రం… కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో బీజేపీ పంచన చేరారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందు.. చాలా మంది ఎన్నికల తర్వాత చేరారు.

దగ్గుబాటి పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నాలక్ష్మినారాయణ, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇలాంటి వారే. వీళ్లే కాదు.. గోదావరి జిల్లాలకు చెందిన సత్యనారాయణ రాజు లాంటి నేతలు కూడా కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరుకున్నారు. వీరికి ఈ నాలుగేళ్లు బాగానే గడిచింది. ఓ మాదిరి నేతలు కూడా లేని బీజేపీలో వీరికి ప్రాధాన్యత దక్కింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంది కాబట్టి.. ఆ పార్టీని భయపెట్టో.. బతిమాలో.. తమ సీట్లను బీజేపీ కోటాలో ఉంచుకుందామని ఆశించారు. కానీ టీడీపీతో పొత్తు చెదిరిపోవడంతో… గతంలో కాంగ్రెస్‌కన్నా దారుణమైన పరిస్థితి ఇప్పుడు బీజేపీకి కనిపిస్తూండటంతో ఒక్కొక్కరు సర్దుకుంటున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు.

కన్నా లక్ష్మినారాయణ చేరిక ఆగిపోయింది. దీనికి కారణం అమిత్ షా బెదిరింపులన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలను ముఖ్యంగా… కన్నా,కావూరి, పురంధేశ్వరి వంటి నేతలను.. పార్టీలో చేర్చుకోవద్దని జగన్‌ను అమిత్ షా ఆదేశించారట. ఇలా బెదిరింపులకు దిగి.. పార్టీ వలసల్ని ఎంత కాలం ఆపుతారనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీతో పొత్తు ఉంటుందో లేదో తెలియడం లేదు. పొత్తు ఉన్న జగన్మోహన్ రెడ్డి.. బీజేపీలో పొటెన్షియల్ లీడర్లందరికీ అవకాశం కల్పిస్తారో లేదో తెలియదు. ఎందుకంటే.. ఇటీవలి కాలంలో… బీజేపీ తరపున చాలా మంది నేతలు తెరపైకి వచ్చారు. చంద్రబాబును విమర్శించి తాము కూడా లీడర్లమేనని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పరిణామాల మధ్య… వాళ్లను ఎంత కాలం కట్టేసి ఉంచగలనేది ఎవరికీ అర్థం కావడంలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నుంచి వలసలు పెరిగితే..ఆ ప్రభావం.. తీవ్రంగా ఉంటుంది. కాంగ్రెస్ లాగా.. బీజేపీ కూడా ఐసోలేట్ అయిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. కనీసం ఈ ప్రచారాన్ని ఆపడానికైనా.. నేతల వలసల్ని అడ్డుకట్ట వేయడానికి షా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు ఎక్కువ రోజులు సఫలమయ్యే అవకాశాల్లేవనేది రాజకీయ నిపుణులు చెప్పే మాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close