తెలుగు ఇండస్ట్రీలో మహిళకు ఇచ్చే విలువెంత?

‘నిర్భయ’ ఘటన తెలుగు చిత్ర పరిశ్రమలో జరిగిందా? లేదు. ‘క‌ఠువా’ చిన్నారిపై అఘాయిత్యం తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిందా? లేదు. ఇండియాలో ప్రతి రోజూ మహిళలపై, అభం శుభం తెలియని పసిపాపలపై ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే… తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిన విషయాలను మీడియా ఛానళ్ళు భూతద్దంలో చూపిస్తున్నాయని ఇటీవల తెలుగు సినిమా ప్రముఖుల్లో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీరెడ్డి వ్యవహారంలో మీడియా వ్యవహరించిన తీరు వల్ల తెలుగు సినిమా పరిశ్రమ పరువుకు కాస్త భంగం వాటిల్లిందనేది మాత్రం అక్షర సత్యం. ఈ పరిణామాల పట్ల హీరోలు, తెలుగు సినిమా పెద్దలూ సమావేశం అయ్యారు. అందులో వారి మధ్య ఏ విషయాలు చర్చకు వచ్చాయో తెలియదు. కాని ఇండస్ట్రీలో మహిళలకు ఎంత గౌరవం ఇస్తారనేది ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నట్టున్నారు. ఇటీవల జరుగుతోన్న సినిమా వేడుకల్లో హీరోల మాటలు చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. నిన్న రాత్రి ‘మహానటి’ ఆడియో విడుదలైంది. అందులో నాగార్జున, ఎన్టీఆర్… ఇద్దరూ మహిళల గౌరవం గురించి మాట్లాడారు.

ముందుగా నాగార్జున మాటల్లో మహిళల ప్రస్తావన చూస్తే… “తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని సెలబ్రిటీల లైఫ్ ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్స్‌లో ‘మహానటి’ ఒకటి. అదీ ఓ తెలుగు సూపర్‌స్టార్‌, ఓ మహిళ మీద తెరకెక్కించిన బయోపిక్‌. ఈ సినిమాను నిర్మించిన స్వప్నదత్, ప్రియాంక దత్… ఇద్దరూ మహిళలే. అలాగే, ఈ సినిమాకి ఇరవైమంది ఫిమేల్ టెక్నీషియన్స్ వర్క్ చేశారట. ఆడియోకి ఇంత అద్భుతమైన స్టేజ్‌ క్రియేట్‌ చేసింది మహిళలే. ఈ సినిమా సెట్స్ వేసింది మహిళలే. తెలుగు సినిమా ఇండస్ట్రీ మహిళలకు ఇచ్చిన గౌరవం అది. ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నా” అన్నారు.

ఇండస్ట్రీలో అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే అబ్బాయిలకు లొంగక తప్పదని, గౌరవం దక్కదని మీడియా ఛానళ్లలో అదే పనిగా కొన్ని రోజులు చర్చలు జరిగిన నేపథ్యంలో నాగార్జున వ్యాఖ్యలు తప్పకుండా ప్రజల్లో ఆలోచన కలిగిస్తాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక, ఎన్టీఆర్ మాటల్లో సమాజంలో జరుగుతోన్న అత్యాచారాల ప్రస్తావన వచ్చింది.

“ఈ మధ్య మహిళలపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయనే వార్తలను మనం చూస్తున్నాం. ఒక్కసారి ‘మహానటి’ చూశాక, (అకృత్యాలకు పాల్పడేవారు) ‘మనం ఎందుకు మగాళ్లగా పుట్టాం?’ అని తప్పకుండా అనుకుంటారు. సావిత్రిగారు ట్రూ లేడీ సూపర్‌స్టార్‌. మహిళ బలం ఏంటో? మహిళలు తలచుకుంటే ఏం చేయగలుగుతారు? అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా చూసి మహిళలను గౌరవిస్తారని ఆశిస్తున్నా” అని ఎన్టీఆర్ మాట్లాడారు. ఈ మాటలు వింటే.. సమాజంలో మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్న విషయాలు వాస్తవమే కదా అనిపించక మానదు. అదే సమయంలో సావిత్రి అనే మహిళకు సినిమా పరిశ్రమ ఎంతటి స్టార్ డమ్ కట్టబెట్టింది? ఎంత గౌరవించింది? అనేది గుర్తు చేశారు. మొత్తం మీద హీరోల మాటలను నిశితంగా గమనిస్తే… ఇండస్ట్రీలో మంచిని ప్రేక్షకులకు అర్థం అయ్యేలా ప్రాజెక్ట్ చెయ్యాలని డిసైడ్ అయినట్టుంది. ఎందుకంటే… ఇండస్ట్రీలో చెడు ఇటీవల అంతకంటే ఎక్కువ ప్రాజెక్ట్ అయ్యింది మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close