విశాల్ ‘అభిమన్యుడు’దీ అల్లు అర్జున్ సిన్మా కథేనా?

కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఓ సైనికుడి కథే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఐదు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ యాక్టింగ్‌కి మంచి పేరొచ్చింది. సేమ్ టు సేమ్ క్యారెక్టర్‌లో తమిళ్ హీరో విశాల్‌కి ఎలాంటి పేరు వస్తుందో చూడాలి. ఎందుకంటే… విశాల్, సమంత జంటగా నటించిన తమిళ సినిమా ‘ఇరుంబుతిరై’. తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని, కోపం ఎక్కువ కల క్యారెక్టర్‌ని విశాల్ చేశార్ట‌. మూడు రోజుల క్రితం విడుదలైన తమిళ ట్రైలర్ చూస్తే ‘చేశార్ట‌’ కాదు.. చేశారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందులో విశాల్ కూడా సైనికుడిగా కనిపించడం విశేషమే. క్యారెక్టర్ ఒక్కటే అయినా, కథలో కీ పాయింట్ ఒక్కటే అయినా… స్క్రీన్‌ప్లే, కథలో డిస్కస్ చేసే టాపిక్స్ డిఫరెంట్‌గా వుంటుందని ఆశించవచ్చు.

‘నా పేరు సూర్య’ దర్శకుడు వక్కంతం వంశీ కథను తండ్రీకొడుకుల అనుబంధం, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని సైనికుడి మనసులో సంఘర్షణగా తీర్చిదిద్దితే… ‘అభిమన్యుడు’ దర్శకుడు పీఎస్ మిత్రన్ సైబర్ వార్, బయో వార్ అంశాల నేపథ్యంలో కథ రాసుకున్నాడు. ఇంటర్నెట్ కారణంగా ప్రజల సమాచారం ఎక్కడికి వెళ్తుంది? దాంతో దేశద్రోహులు ఏం చేస్తున్నారు? అనే విషయాలను డిస్కస్ చేసినట్టున్నాడు. ఇంకో విచిత్రం ఏంటంటే… ‘నా పేరు సూర్య’లో హీరో తండ్రిగా నటించిన యాక్షన్ కింగ్ అర్జున్, ‘అభిమన్యుడు’లో విలన్ క్యారెక్టర్ చేశార్ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close