దాస‌రి విగ్ర‌హంపై.. మోహ‌న్‌బాబు కినుక‌?

ఇటీవ‌ల దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతి సంద‌ర్భంగా ఫిల్మ్ చాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో దాస‌రి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు… ‘డైరెక్ట‌ర్స్ డే’ అని ప్ర‌క‌టించి దాస‌రికి ఘ‌న నివాళి ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది చిత్ర‌సీమ‌. అయితే ఈ కార్య‌క్ర‌మం జ‌రిగిన తీరుపైన‌, దాసరి విగ్ర‌హం విష‌యంలోనూ మోహ‌న్‌బాబు కాస్త గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆవర‌ణ‌లో ప్ర‌తిష్టించిన దాస‌రి విగ్ర‌హం మ‌ట్టితో త‌యారు చేసిన‌ది. `అంత గొప్ప వ్య‌క్తికి కాంస్య విగ్ర‌హం చేయించాలి గానీ, ఈ మ‌ట్టి విగ్ర‌హం ఎందుకు?` అంటూ త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర మండిప‌డ్డార‌ట మోహ‌న్ బాబు. ”న‌న్ను అడిగితే డ‌బ్బులు ఇద్దును క‌దా. న‌న్ను సంప్ర‌దించ‌కుండా ఈ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశార‌”ని మోహ‌న్‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. దాస‌రి విగ్ర‌హం ఏర్పాటు చేసిన స‌మ‌యంలో మోహ‌న్‌బాబు ఇండియాలో లేరు. ఆప‌రేష‌న్ నిమిత్త‌మై అమెరికా వెళ్లారు. తిరిగొచ్చాక విగ్ర‌హం గురించీ, ఆ కార్య‌క్ర‌మం జ‌రిగిన తీరు గురించీ తెలుసుకున్న మోహ‌న్‌బాబు త‌న అసంతృప్తి వెళ్ల‌గ‌క్కిన‌ట్టు తెలుస్తోంది. దాస‌రి విగ్ర‌హం ప్ర‌తిష్టించి ఇంకా ప‌ది హేను రోజులు కూడా కాలేదు. అప్పుడే ఈ విగ్ర‌హం రంగు వెలిసిపోవ‌డం మొద‌లైంద‌ని తెలుస్తోంది. ‘గురువు గారికి ఇచ్చే గౌర‌వం ఇదేనా’ అంటూ దాస‌రి ప్రియ శిష్యుడు మోహ‌న్‌బాబు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close