పిక్చర్ క్లియర్: 2019లో మోదీ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు..!!

భారత రాజకీయాల్లో ఇప్పుడొక క్లారిటీ వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేరుగా ఢీకొట్టబోయేది ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలే. బెంగళూరులో ప్రాంతీయ పార్టీల అధినేత చూపించిన పట్టుదలే దీనికి సాక్ష్యం. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రాంతీయ పార్టీల కూటమికి బెంగుళూరులో మొదటి అడుగు పడింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రాంతీయ పార్టీలన్నీ… తమ బలాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించాయి.

ప్రాంతీయ పార్టీలన్నీ ఓ కూటమిలా ఏర్పడాలని మమతా బెనర్జీ ఆకాంక్షించారు. చంద్రబాబుతో చర్చలు జరిపారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాంతీయ పార్టీల అధినేతలను చంద్రబాబు తొలిసారి కలుసుకున్నారు. ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత ఉండాలని అందరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది. రాష్ట్రాల హక్కుల కోసం అందరూ పోరాడాలని నిర్ణయించారు. మోదీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీల నేతలంతా ఏకమయ్యారన్న సూచనలు దేశ ప్రజల్లోకి పంపేందుకు వ్యూహాత్మకంగా నేతలంతా ఈ వేదికను ఉపయోగించుకున్నారు. ఈ ప్రయత్నం ప్రస్తుతానికి మంచి ఫలితాలే ఇచ్చింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ విషయాన్ని పక్కన పెట్టి.. ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే బాగుంటుదన్న అభిప్రాయం అన్ని పార్టీల నేతల్లోనూ వచ్చింది. ఎన్నికల సమయానికి ఓ రూపం వచ్చే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసేందుకు తమ కార్యాచరణ కొనసాగుతుందని మమతాబెనర్జీ, చంద్రబాబు ప్రకటించారు.
కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరు కాని ప్రధాన పార్టీల్లో టీఆర్ఎస్, బీజేడీ, శివసేన ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. బీజేడీ మాత్రం… కేంద్రంతో కొన్ని అంతర్గత ఒప్పందాల వల్ల హాజరు కాలేకపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇక శివసేన.. నేరుగానే బీజేపీపై తిరుగుబాటు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం..మోదీకి ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చోట… మాత్రం అడ్వాంటేజ్ ఎవరికి వస్తుందన్నది కీలకంగా మారబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close