13ఏళ్ల తరువాత భారత ప్రధాని లక్నోకి వస్తున్నారు

ప్రధాని నరేంద్ర మోడి ఇవ్వాళ్ళ ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గం వారణాసికి, ఆ తరువాత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి నియోజక వర్గమయిన లక్నోకి వెళుతున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇంతవరకు నాలుగుసార్లు ఆయన తన వారణాసి నియోజక వర్గానికి వచ్చేరు. ఇది ఐదవసారి అవుతుంది. వారణాసి పర్యటనలో ఆయన 22మంది వికలాంగులకు అవసరమయిన పరికరాలు అందజేస్తారు. ఆ తరువాత ఈ కార్యక్రమంలో మొత్తం 9274 మంది వికలాంగులకి అవసరమయిన పరికరాలు అందజేయబడతాయి. వారణాసి నుంచి డిల్లీకి మహామన సూపర్ ఫస్ట్ ఎక్స్ ప్రెస్ ని ఆరంభించబోతున్నారు. అది వారణాసి నుండి డిల్లీకి 14 గంటలలోనే చేరుకొంటుంది.

ఆ తరువాత భరత్ పూర్ లో కొన్ని కార్యక్రమాలలో పాల్గొని అక్కడి నుండి ప్రత్యేక విమానంలో లక్నో చేరుకొంటారు. చాలా విచిత్రమయిన విషయం ఏమిటంటే గత 13 ఏళ్లుగా ఏ ప్రధానమంత్రి లక్నో నగరంలో కాలుపెట్టలేదు. కనుక ప్రధాని నరేంద్ర మోడి లక్నో పర్యటనకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. ఉత్తరపదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదావ్ ప్రధాని నరేంద్ర మోడికి అక్కడ స్వాగతం పలుకుతారు. కానీ బీజేపీకి, సమాజ్ వాది పార్టీకి మధ్య విభేదాలున్నందున అఖిలేష్ యాదవ్ మోడీకి స్వాగతం పలికి వెళ్ళిపోతారు.

ప్రధాని నరేంద్ర మోడి బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ యూనివర్సిటీలో విద్యార్ధులనుద్దేశ్యించి ప్రసంగిస్తారు. ఆ తరువాత లక్నోలోని కొల్విన్ తాలుక్ దార్ కాలేజీ మైదానంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (నైపుణ్యాభివృద్ధి పధకం) క్రింద ఈ-ఆటోరిక్షాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పధకంలో భాగంగా 3,500 ఈ-ఆటోరిక్షాలు పంపిణీ చేయబడతాయి. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడి ఆటో డ్రైవర్లతో మాట్లాడుతారు. ఆ తరువాత బాబా సాహెబ్ భీంరావ్ అంబేద్కర్ సభలో పాల్గొంటారు. మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకి డిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడికి ఉగ్రవాదుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చినందున ఆయన పర్యటన సందర్భంగా వారణాసి, లక్నోలో చాలా భారీ సంఖ్యలో భద్రతాదళాలను మొహరించబడ్డాయి. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ప్రధాని నరేంద్ర మోడి ఇకపై తరచూ ఆ రాష్ట్రంలో పర్యటించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close