కాంగ్రెస్‌కు దానం గుడ్ బై..! టీఆర్ఎస్‌లో చేరే చాన్స్..!

మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను..పార్టీ అధ్యక్షుడు రాహుల్ తో పాటు .. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. చాలా రోజులుగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. 2015లో గ్రేటర్ ఎన్నికల సందర్భంగానే దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అప్పట్లో ఓ తేదీని కూడా అనుకున్నారు. టీఆర్ఎస్ భవన్ చుట్టూ ఫ్లెక్సీలు కూడా.. పెట్టుకున్నారు. కానీ చివరి క్షణంలో టీఆర్ఎస్ లోచేరాలన్న నిర్ణయాన్ని దానం నాగేందర్ వాయిదా వేసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరాలనుకున్నారు. కానీ కేసీఆర్ హరీష్ రావు సమక్షంలో పార్టీలో చేరమని సూచించినట్లు సమాచారం. తనకు పార్టీలో చేరకుండానే ప్రాధాన్యత తగ్గిస్తున్నారన్న ఉద్దేశంతో దానం అప్పట్లో వెనక్కి తగ్గారని ప్రచారం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ కూడా బుజ్జగించడంతో.. సైలంటయిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుకుగా పాల్గొనడం లేదు. ఇటీవలి కాలంలో పార్టీ పదవుల విషయంలోనూ.. దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. తనను పదవి నుంచి తీసేసి గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అంజన్ కుమార్ ను నియమించారు.

ఎన్నికల వేడి పెరుగుతూండటంతో.. చివరికి ఆయన కాంగ్రెస్ కు గుడ్ పై చెప్పాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లో మాస్ లీడర్ గా పేరున్న దానం నాగేందర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు. 2004లో అసిఫ్ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కు హైకమాండ్ టిక్కెట్ ఇవ్వకపోతే.. టీడీపీలో చేరి అదే స్థానం నుంచి గెలుపొందారు. కానీ వైఎస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడంతో టీడీపీకి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉపఎన్నికల్లో ఓడిపోయారు. కానీ 2009లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి పదవిని పొందారు. వైఎస్ లేకపోయినా ఐదేళ్లు మంత్రిగా కొనసాగలిగారు. దానం నాగేందర్ మళ్లీ టీఆర్ఎస్ వైపే చూస్తున్నారని.. ఆయన అనుచరులు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

దాడులు, దౌర్జన్యాలు – ఏపీలో వ్యవస్థలున్నాయా ?

పుంగనూరు నియోజకవర్గంలో రామచంద్రయాదవ్ అనే నేత పెద్దిరెడ్డి ఊరికి ప్రచారానికి వెళ్లారు. అక్కడ జరిగిన విధ్వంసం కళ్లారా చూస్తే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ గ్రామ తమ సొంత సామ్రాజ్యం అన్నట్లుగా ఎవరూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close