సెట్లో కూడా జ‌గ‌న్ మ‌నుషులే

వైఎస్సార్ జీవిత క‌థ ఆధారంగా `యాత్ర‌` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో దీన్నో వైకాపాకి క‌ర‌ప‌త్రంగా వాడే అవ‌కాశాలున్నాయ‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌ని రంగంలోకి దించిన‌ట్టు.. వైకాపా త‌ర‌పున `యాత్ర‌` రాబోతోంద‌న్న‌మాట‌. ఈ చిత్రానికి వెనుక నుంచి పెట్టుబ‌డి అందిస్తోంది జ‌గ‌న్ పార్టీ పెద్ద‌లే అని టాలీవుడ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. అంతేనా…? స్క్రిప్టు మొత్తం జ‌గ‌న్ చేతిలో పెట్టి, ఆయ‌న `ఓకే` అన్న త‌ర‌వాతే.. ఈ సినిమా ప‌ట్టాలెక్కింద‌ని టాక్‌. తీస్తోంది వైఎస్సార్ బ‌యోపిక్ కాబ‌ట్టి, త‌న‌యుడిగా జ‌గ‌న్‌కు స్క్కిప్టు చ‌ద‌వాల‌న్న ఆశ‌, అందులో ఏముందో తెలుసుకుకోవాల‌న్న కుతూహలం ఉండ‌డం స‌హ‌జం. అయితే సెట్లోనూ జ‌గ‌న్ మ‌నుషులే క‌నిపిస్తున్నార‌ని, ఏపూట‌కాపూట అప్‌డేడ్స్ వైకాపా పెద్ద‌ల‌కు అందుతూనే ఉన్నాయ‌ని తెలుస్తోంది. నిజానికి వైఎస్సార్ జీవితం మొత్తం ఈ సినిమాలో రంగ‌రిద్దామ‌నుకున్నారు. కానీ.. ఆ ఆలోచ‌న మారింద‌ట‌. కేవ‌లం పాద యాత్ర‌కు ముందు, త‌ర‌వాత ప‌రిస్థితులు, పాద యాత్ర జ‌రిగిన తీరుతెన్నులు మాత్ర‌మే క‌థ‌లో ఉంటాయ‌ని తెలుస్తోంది. చంద్ర‌బాబు, కేసీఆర్ పాత్ర‌ల‌కు ఈ క‌థ‌లో అంత ప్రాధాన్యం లేద‌ని స‌మాచారం. మొత్తానికి క‌థ‌, స్క్రీన్ ప్లే ఎవ‌రివైనా – వెనుక నుంచి డైరెక్ష‌న్ చేస్తోంది మాత్రం వైకాపా పార్టీనే అన్న‌ది టాలీవుడ్ జ‌నాల మాట‌. మ‌రి చిత్ర రూప‌క‌ర్త‌లేమంటారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close