సీఎం రమేష్‌తో దీక్ష విరమింప చేసిన చంద్రబాబు..‍! కేంద్రానికి రెండు నెలల గడువు..!!

కడప ఉక్కు పరిశ్రమ కోసం పదకొండు రోజులుగా చేస్తున్న దీక్షను… రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ విరమించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. సీఎం రమేష్ చేత దీక్షను విరమింపచేయడానికి కడప వచ్చిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని మెకాన్ సంస్థ నివేదిక ఇచ్చినప్పటికి కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆరు నెలల్లో ప్లాంట్‌ పెట్టాలని చట్టంలో ఉన్నా…ఇంతకాలం కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మెకాన్‌ సంస్థ నివేదిక ఇచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసుల కోసం లాలూచీపడి రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలన్నింటినీ కల్పించిన విషయాన్ని చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. గండికోటకు నీరు తీసుకొచ్చి ..నీటి కొరత కూడా లేకుండా చేశామన్నారు. 15కి.మీ. దూరంలో హైవే, రైల్వేలైన్‌ ఉందన్నారు. అందరూ సంఘటితంగా ఉంటేనే కేంద్రం దిగి వస్తుందన్న చంద్రబాబు కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీని సాధించి తీరతామని శపథం చేశారు. కేంద్రం పూర్తి స్థాయిలో ప్లాంట్ ను ఏర్పాటు చేయలేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యానికి సిద్ధంగా ఉందని…దానికి కూడా కేంద్రం అంగీకరించకపోతే.. రాష్ట్ర ప్రభుత్వమే ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతుందని చంద్రబాబు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొంగులేటి సుధాకర్ రెడ్డి.. విభజన హామీలు అమలు కావడం లేదంటూ… సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కేంద్రం కౌంటర్ వేసింది. అందులో తెలంగాణలోని బయ్యారం, ఏపీలోని కడప స్టీల్ ప్లాంట్లు పెట్టడం అసాధ్యమని.. తెలిపింది. దీంతో ఒక్కసారిగా గగ్గోలు రేగింది. తెలంగాణలో రాజకీయ పార్టీలు దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా..ఏపీలో మాత్రం.. అధికార పార్టీ ఉద్యమం ప్రారంభించారు. కడప జిల్లాకు చెందిన రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణదీక్షకు కూర్చున్నారు. ఏడు రోజులకు ఆరోగ్యం విషమించడంతో బీటెక్ రవిని ఆస్పత్రికి తరలించారు. సీఎం రమేష్‌తో పదకొండు రోజుల తర్వాత ముఖ్యమంత్రి దీక్ష విరమింప చేశారు.

ప్రత్యక్ష ఎన్నికలలో ఇంత వరకూ ఒక్క సారి కూడా పోటీ చేయని సీఎం రమేష్.. ఆమరణ దీక్ష చేసినా.. ప్రజాస్పందన అనూహ్యంగా వచ్చిందని… టీడీపీ వర్గాలు చెబుతున్నారు. కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో.. అదీ సొంత జిల్లాకు కేంద్రం అన్యాయం చేస్తున్నా.. జగన్ నోరు మెదపని అంశాన్ని టీడీపీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ దీక్ష ఎఫెక్ట్ ను రాజకీయంగా ఉపయోగించేందుకు టీడీపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close