క్రిష్ త‌న నిజాయ‌తీ నిరూపించుకోవాల్సిందేనా?

క్రిష్ లాంటి ద‌ర్శ‌కులెప్పుడూ మ‌సి పూసి మారేడు కాయ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఎందుకంటే… వాస్త‌విక ప్ర‌పంచంలో బ‌తుకుతారు కాబ‌ట్టి. సినిమా విష‌యంలో ఆయ‌న‌కంటూ కొన్ని నియ‌మాలూ, సూత్రాలు ఉన్నాయి. వాటిని ఎప్పుడూ జ‌వ దాట‌లేదు. క్రిష్ చేతిలోకి ఓ ప్రాజెక్టు వెళ్లిందంటే.. అది కమ‌ర్షియ‌ల్‌గా హిట్ అయినా, అవ్వ‌క‌పోయినా – క‌చ్చితంగా మంచి ప్ర‌య‌త్నంగా మిగిలిపోతుంది. ఇప్పుడాయ‌న `ఎన్టీఆర్‌`ని తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డారు. క్రిష్ రాక‌తో ఈ ప్రాజెక్టుపై మ‌రింత ఫోక‌స్ పెరిగింద‌నే విష‌యంలో ఎవ‌రికీ ఎలాంటి సందేహాలు అవ‌స‌రం లేదు. అయితే.. ఫ‌స్ట్ లుక్‌తో కొన్ని అనుమానాలు ఎదుర్కోవాల్సివ‌చ్చింది. దీన్ని మార్ఫింగ్ చేశార‌ని, బ్లాక్ అండ్ వైట్ కాబ‌ట్టి… మార్ఫింగ్ పెద్ద‌గా తెలియ‌డం లేద‌ని, ఇది నిజ‌మైన లుక్ కాద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. దాన్ని తిప్పికొట్ట‌డానికి క్రిష్ ఈసారి క‌ల‌ర్ ఫొటోని ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తన‌యుడిగా బాల‌య్య ఎలా ఉన్నా జ‌నాలు చూస్తారు, ఆద‌రిస్తారు. బాల‌య్య ఎన్టీఆర్‌లా క‌నిపించినా, క‌నిపించ‌క‌పోయినా… ఎన్టీఆర్ వార‌సుడిగా ఆ పాత్ర‌ని ఆయ‌నే బాగా పోషించ‌గ‌ల‌ని అభిమానుల న‌మ్మ‌కం. ఈ ప‌రిస్థితిలో క్రిష్‌కి మ‌సిపూసి మారేడు కాయ చేయాల్సిన అవ‌స‌రం లేదు. మార్ఫింగ్ ఆలోచ‌న ఆయ‌న‌కెప్పుడూ వ‌చ్చి ఉండ‌దు.

ఈ పాత్ర కోసం బాల‌య్య‌.. అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నాడు. తండ్రి లా మార‌డానికి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. దాని ఫ‌లిత‌మే.. ఈ లుక్‌. దాన్ని మార్ఫింగ్ అని ఇప్పుడే నిందించ‌డం, క్రిష్ లాంటి ద‌ర్శ‌కుడ్ని తొలి అడుగులోనే విమర్శించ‌డం స‌బ‌బు కాద‌నిపిస్తుంది. ఇంకొంత కాలం ఆగాలి. ఇంకొన్ని లుక్‌లు చూడాలి. అప్పుడుగానీ ఓ అవ‌గాహ‌న‌కు రాలేం. ఇదేం మార్ఫింగ్ ఫొటో కాద‌ని… చిత్ర‌బృందంలోని కొంత‌మంది స‌భ్యులు బ‌ల్ల‌గుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఒక‌టి… వెండి తెర‌పై ఇలాంటి మార్ఫింగుల‌కు చోటు లేదు. అక్క‌డ‌ ఎలాంటి జిమ్మిక్కుల చేసినా దొరికిపోతారు. బాల‌య్య‌ని ఎన్టీఆర్‌గా మార్చాల్సిన బాధ్య‌త క్రిష్‌దే. అందులో ఆయ‌న విజ‌య‌వంతం అయ్యారా, లేదా? అనేది తెలియాలంటే… `ఎన్టీఆర్‌` రావాల్సిందే. ఇలా లుక్కులు చూసి ఓ అభిప్రాయానికి రావ‌డం స‌రికాదేమో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close