బీజేపీ మార్క్ ప్రజాస్వామ్యం..! బలం లేదని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వాయిదా..?

ఢిల్లీ రాజకీయాల్లో కొద్ది రోజులుగా… రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకూ మెజార్టీ లేదు. మిత్రపక్షాలు.. ప్రస్తుత రాజకీయ ట్రెండ్‌ను పరిశీలిస్తే.. కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చే అభ్యర్థికే… ఎడ్జ్ కనిపిస్తోంది. కానీ విపక్షాలకు.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇష్టం లేదు. అందుకే బీజేపీ వ్యూహకర్తలు మరో వ్యూహం సిద్ధం చేశారు. యుద్ధం చేయలేకపోతే.. వాయిదా వేసుకోవడం బెటర్ అన్నట్లుగా వారి వ్యూహం ఉంది. అసలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వాయిదా వేద్దామని దాదాపుగా నిర్ణయించేశారు. అందుకే 18వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నా… ఇంత వరకూ.. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం రాజ్యసభ ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు.

సంప్రదాయం ప్రకారం… రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్టును.. విపక్ష పార్టీలకు ఇస్తూంటారు. కానీ నరేంద్రమోడీ మాత్రం.. ఆ పదవి కూడా బీజేపీ చేతిలోనే ఉండాలని భావిస్తున్నారు. అందుకే విపక్షాలకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఇవ్వడం లేదు. కానీ.. సొంతంగా గెలిపించుకోవడానికి కూడా.. బీజేపీ దగ్గర సరిపడా బలం లేదు. జూలై 2వ తేదీతో.. పి.జె.కురియన్ పదవీ కాలం కూడా ముగిసింది. ఇప్పుడు తప్పనిసరిగా.. ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి. కానీ బీజేపీ మాత్రం…వాయిదాకే మొగ్గు చూపుతోంది. దాని కోసం రాజ్యాంగాన్నే అడ్డు పెట్టుకుంటోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పోస్ట్ ఖాళీ అయిన తర్వాత కచ్చితంగా ఇన్ని రోజుల్లో భర్తీ చేయాలని.. రాజ్యాంగంలో లేదని.. చెప్పుకొస్తున్నారు.

కురియన్ స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకోవాలని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇప్పటికే కేంద్రానికి సూచించారు. ఎన్నికకు సంబంధించిన ప్రక్రియను కొనసాగించాలని కోరారు. ఆ తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ కూడా వెంకయ్యనాయుడుతో సమావేశమ్యారు. అయినా కేంద్రం సైలెంట్ అయిపోయింది. రాజ్యసభ చైర్మన్ ఒక్కరే సభ నిర్వహించడం కష్టం కాబట్టి… డిప్యూటీ చైర్మన్ అవసరం ఉంటుంది. కానీ తాత్కలిక డిప్యూటీ చైర్మన్ ను నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. దీనికి ఎన్నిక అవసరం లేదు. ప్రభుత్వం ఈ విధానానికే మొగ్గు చూపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కంటోన్మెంట్ ఉప ఎన్నిక : విజయం ఎవరిని వరిస్తుందో..?

లోక్ సభ ఎన్నికలతోపాటు తెలంగాణలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక గురించి పెద్దగా చర్చే లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల హడావిడే ఇందుకు ప్రధాన కారణం. మల్కాజ్ గిరి లోక్ సభతోపాటు...

ఈటీవీ నుంచి మ‌రో ఓటీటీ.. ఈసారి వేరే లెవ‌ల్‌!!

సినిమా ప్ర‌పంచంలో ఓటీటీ భాగం అయిపోయింది. సినిమా వ్యాపారంలో ఓటీటీల‌దే కీల‌క భాగ‌స్వామ్యం. అందుకే ఓటీటీల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. మీడియా రంగంలో అగ్ర‌గామిగా నిలిచిన‌ ఈనాడు సైతం ఓటీటీలోకి అడుగు పెట్టింది....

క‌థాక‌మామిషు! (వారం వారం కొత్త క‌థ‌ల ప‌రిచ‌యం)

సాహితీ ప్ర‌క్రియ‌లో క‌థ‌ల‌కు విశిష్ట‌మైన స్థానం ఉంది. మాన‌సిక ఉల్లాసానికీ, స‌రికొత్త‌ ఆలోచ‌నా దృక్ప‌థానికీ క‌థ‌లు త‌మ వంతు సాయం అందిస్తుంటాయి. ఆమ‌ధ్య‌కాలంలో క‌థ‌ల‌కు పెద్ద‌గా ప్రోత్సాహం ల‌భించేది కాదు. అయితే ఇప్పుడు...

ఆఫ్రికాకు పెద్దిరెడ్డి జంప్ – చెప్పకనే చెప్పారుగా !?

మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే... ఇక్కడి నుంచే ఎందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close