కేంద్రంపై టీడీపీ అవిశ్వాసం..! శుక్రవారమే చర్చ..!!

నరేంద్రమోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, తోట నర్సింహం, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ తెలిపారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో చదివి వినిపించారు. సభ ఆర్డర్ లో ఉండటంతో అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపేవారు లేచి నిలబడాల్సిందిగా స్పీకర్ కోరారు కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం, ఆర్ఎస్పీ, ఆప్, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ పార్టీ ఎంపీలందరూ… అవిశ్వసానికి మద్దతుగా నిలబడ్డారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలంటే.. 50 మంది ఎంపీల మద్దతు ఉండాలి. అంత కన్నా ఎక్కువగానే ఎంపీల మద్దతు ఉండటంతో… అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతినిస్తామని స్పీకర్ ప్రకటించారు. శుక్రవారం చర్చ జరపాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 10 రోజుల్లోగా అవిశ్వాసంపై చర్చ చేపట్టాలి. కానీ స్పీకర్ సుమిత్రా మహాజన్ చాలా ముందుగా చర్చ తేదీని ఖరారు చేశారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాస నోటీసును పరిగణనలోకి తీసుకోవడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని పట్టించుకోకుండా టీడీపీ పెట్టిన అవిశ్వాసాన్ని తీసుకోవడం ఏంటని మల్లిఖార్జున్ ఖర్గే ప్రశ్నించారు. అయితే నిబంధనల ప్రకారమే అవిశ్వాస నోటీసులపై నిర్ణయం తీసుకున్నానని స్పీకర్ స్పష్టం చేశారు.

టీడీపీ అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్‌కు చెందిన ఎంపీలు మద్దతు ఇవ్వలేదు. తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై పార్టీ అధినేత కేసీఆర్ తమకు ఆదేశాలు ఇవ్వలేదని ఎంపీలు చెబుతున్నారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా లేచి నిలబడ్డారు. ఆయా పార్టీల బలం ఆధారంగా… ఎవరెవరికి ఎంత ఎంత సేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలో స్పీకర్ ఖరారు చేస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ లో 535 మంది సభ్యులున్నారు. బీజేపీకి సొంతంగా సాధారణ మెజార్టీ ఉంది. బీజేపీ పాలనా వైఫల్యాన్ని ఎండగట్టడానికి… ఈ అవిశ్వాసాన్ని విపక్ష పార్టీలు ఓ అవకాశంగా ఉపయోగించుకోనున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close