ప్రత్యేకహోదాపై యూటర్న్ తీసుకుంది ఎవరు..? మోదీనా..? చంద్రబాబా..?

ప్రత్యేకహోదా ఇస్తామన్నది ఎవరు..? యూటర్న్ తీసుకుని ఇప్పుడు కుదరదని చెబుతోంది ఎవరు..? అదే పెద్ద మనిషి ఇప్పుడు ఎవర్నీ యూటర్న్ తీసుకున్నారని నిందిస్తున్నారు..? విభజన హామీల్లో అత్యంత ముఖ్యమైనది ప్రత్యేకహోదా. ప్రత్యేక హోదాపై 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. సరిగ్గా 9 రోజుల తర్వాత మార్చి 1న కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసింది. మరో నాలుగురోజులకు మార్చి 5న కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. తమకు సమయం లేనందువల్ల ప్రత్యేక హోదా ను అమలు చేయలేకపోయామని మన్మోహన్ సింగ్ కూడా తర్వాత రోజుల్లో రాజ్యసభలో ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఎన్నికల ప్రచారంలో కూడా.. ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు.

ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని, రాజ్యసభలో ఒక ప్రధాని చేసిన ప్రకటన ను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే భావిస్తామని మోదీ ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో బిజెపి నేతలు చెప్పారు. జాతీయ అభివృద్ది మండలిలో మెజారిటీ ముఖ్యమంత్రులు బిజెపి, కాంగ్రెస్ కు చెందిన వారే కనుక ఎన్డీసీ అనుమతి కూడా లభిస్తుందని వాదించారు. మెల్లగా… ప్రత్యేకహోదా అంశాన్ని పక్కన పెట్టారు. చివరికి పధ్నాలుగో ఆర్థిక సంఘాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు. ఆర్థిక సంఘం పర్వత ప్రాంత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యక ప్రయోజనాలివ్వాలని చెప్పిందటూ.. తమంతట తాముగా… అనేసుకుని… ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని నిర్ణయించారు. అంటే… ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తన హామీపై తానే యూటర్న్ తీసుకున్నారు.

బీజేపీ ప్రభుత్వం.. నరేంద్రమోడీ చేస్తున్న కుట్రను గుర్తించలేని చంద్రబాబు హోదా పేరు లేకుండా.. అన్నీ ఇస్తామని చెప్పుకొచ్చారు. దాంతో ఆయన అంగీకరించారు. కానీ ఒక్క రూపాయి అంటే.. ఒక్క రూపాయి కూడా.. ప్యాకేజీ కింద నిధులు ఇవ్వలేదు. పైగా.. ఇక ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఉండదని చెప్పి.. ఇప్పుడు… పదకొండు రాష్ట్రాలకు పొడిగించారు. ఈ మోసం బయటపడటం.. ప్యాకేజీకి ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో.. చంద్రబాబు… మళ్లీ ప్రత్యేకహోదా డిమాండ్ ఎత్తుకోవాల్సి వచ్చింది. ఈ ఎపిసోడ్‌లో యూటర్న్ తీసుకుంది మోడీ అయితే.. అదే మోడీ.. చంద్రబాబును యూటర్న్ తీసుకుంటున్నారని విమర్శించడం.. అసలు రాజకీయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close