శ్రీవారి హుండీల్లో ఒక్క రోజే రూ. 6.28 కోట్లు..!

తిరుమల శ్రీవారి చరిత్రలో అత్యధిక హుండీ ఆదాయం వచ్చిన రోజుగా.. జూలై 25వ తేదీ నిలిచింది. ఒక్క రోజే.. రూ. 6.28 కోట్లు.. హుండీల ద్వారా శ్రీవారి ఖజానాకు జమ చేరాయి. ఇది టీటీడీ చరిత్రలోనే అత్యధికం. సాధారణంగా.. రోజుకు రూ. 3కోట్లకు అటూ ఇటూగా.. శ్రీవారి హుండీ ఆదాయం ఉంటుంది. కానీ ఇరవై ఐదో తేదీ మాత్రం.. పంట పండినట్లయింది. సాధారణం.. ఈ రోజు హుండీ ఆదాయం రేపు లెక్కిస్తారు. అలా చూసుకుంటే.. ఈ మొత్తం ఇరవై ఐదో తేదీన హుండీల్లో పడినట్లయింది. గతంలో రెండుసార్లు గరిష్ఠంగా హుండీ ఆదాయం నమోదైంది. 2012, ఏప్రిల్ 2న శ్రీరామ నవమి పర్వదినం నాడు రూ. 5.73 కోట్ల ఆదాయం సమకూరగా.. అదే సంవత్సరం జనవరి 1న కొత్త ఏడాది రోజు . 4.23 కోట్లు ఆదాయంగా వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ రికార్డును తాజాగా అధిగమించారు.

సాధారణంగా.. ఇంత పెద్ద మొత్తం హుండీల్లో లభించిందంటే.. ఆజ్ఞాత భక్తులు ఒకరో ..ఇద్దరో ఒకేసారి పెద్ద మొత్తంలో వేస్తూ ఉంటారు. ఇప్పుడు విరాళాలకు కూడా పక్కా లెక్కలు ఉంటున్నాయి. గతంలో.. టీటీడీకి విరాళాలు ఇచ్చేవారు.. తమ వివరాలను గోప్యంగా ఉంచమని చెప్పేవారు. కొంత మంది తమ వివరాలేమిటో కూడా చెప్పకుండా విరాళాలు ఇచ్చి వెళ్లేవారు. కానీ ఇప్పుడు టీటీడీకి వచ్చే విరాళాలకు కూడా పక్కా సమాచారం తీసుకుంటున్నారు. అందుకే… గోప్యంగా కొంత మంది హుండీల్లో పెద్ద మొత్తం వేసి వెళ్లిపోతున్నారు. ఇలా ఎవరైనా … ఒకే భక్తుడు..పెద్ద మొత్తంలో వేశారా లేదా అన్నదానిపై క్లారిటీ రాలేదు.

నిజానికి నోట్ల రద్దు సమయంలో.. శ్రీవారి హుండీ ఆదాయం ఒక్కసారిగా పెరిగింది. లెక్కలు లేని సొమ్ము ఉన్న చాలా మంది.. ఊరినే పోగొట్టడం ఎందుకని… తీసుకొచ్చి..శ్రీవారి హుండీల్లో వేసేవారు. అప్పుడు కూడా ఇంత మొత్తంలో హుండీ ఆదాయం లేదు. ఆ తర్వాత… నోట్ల మార్పిడి గడువు ముగిసిన తర్వాత శ్రీవారి హుండీ నిండటం గగనమయింది. రోజుకు రూ. 2 నుంచి రూ.3 కోట్ల మధ్యే ఆదాయం ఉండేది. ఇప్పుడిప్పుడే నోట్ల కష్టాలు తీరడంతో.. వడ్డీ కాసుల వాడికి.. వడ్డీలకు కావాల్సినంత హుండీ ఆదాయం వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close