క్రైమ్‌: ప్రాణం తీసిన యూట్యూబ్ డాక్టర్ ..!

ప్రసవమంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అనుభవమున్న డాక్టర్ల సలహాలతో డెలివరీకి వెళ్తారు. కానీ చెన్నైలో ఓ జంట మాత్రం ఆధునిక వైద్యాన్ని నమ్మకుండా… యూట్యూబ్‌ను నమ్ముకున్నారు. గర్భంతో ఉన్న భార్యకు నొప్పులు రాగానే ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే డెలివరీకి ప్రయత్నించాడు భర్త. అది వికటించింది. తీవ్ర రక్తస్రావంతో భార్య ప్రాణాలు కోల్పోయింది. కానీ బిడ్డ మాత్రం క్షేమంగా ఉంది. ఈ ఘటన ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ అయింది.
.
యూట్యూబ్‌ వైద్యం వెనుక భర్త కార్తీకేయన్‌ స్నేహితుడి సలహా ఉందని చెబుతున్నారు పోలీసులు. సహజసిద్ధమైన ఆరోగ్య పద్థతులను అనుసరించాలని చెప్పే ఈ జంట.. యూట్యూబ్‌ డెలివరి ఐడియా ఇచ్చారంటున్నారు. స్నేహితుడి సూచనను గుడ్డిగా నమ్మిన కార్తికేయన్‌ యూట్యూబ్‌ డెలివరీతో భార్యను పొగొట్టుకున్నాడు. గర్భం దాల్చినప్పటి నుంచే ఈ జంట హోమ్‌ డెలివరీకి సిద్ధమై ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. అందుకే క్రితిక అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌కేర్‌ సెంటర్‌లో నమోదు చేసుకోలేదని వెల్లడించారు. యూట్యూబ్‌ డెలివరీ వికటించడంతో కార్తీకేయన్‌ భార్యను హుటాహుటిగా తిర్పూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే క్రితిక మరణించినట్లు చెప్పారు డాక్టర్లు.

ఈ ఘటన అటు డాక్టర్లను షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు క్రితిక తండ్రి…. కార్తికేయన్‌పై కేసు పెట్టారు. ఓ వైపు అత్యాధునిక శాస్త్రసాంకేతికతో ముందుకు సాగుతుంటే.. అదే టెక్నాలజీని మూర్ఖంగా వినియోగించుకుంటూ ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close