రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక..! అడ్వాంటేజ్ ఎన్డీఏ..!!

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో గణాంకాలు అధికార ఎన్డీఏకు అనుకూలంగా మారుతున్నాయి. తమ సభ్యుడికి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు కాబట్టి.. తాము ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తామని అన్నాడీఏంకే ప్రకటించింది. అన్నాడీఎంకేకు 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇక బిజూ జనతాదళ్ కూడా.. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌కు మద్దకు ప్రకటించారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్.. స్వయంగా ఫోన్ చేయడంతో… మద్దతు ఇస్తానని నవీన్ పట్నాయక్ మాట ఇచ్చారు. బిజేడీకి 9 మంది రాజ్యసభ సభ్యులున్నారు. ఇక ఆరుగురు సభ్యులున్న టీఆర్ఎస్ ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటించకపోయినా.. జేడీఎస్ అభ్యర్థికే మద్దతు పలకడం ఖాయం. ఇక శివసేన, జేడీఎస్‌ కూడా అమిత్ షా .. బుజ్జగించడంతో మెత్తబడ్డాయి. ఎన్డీఏ అభ్యర్థికే ఓటేయాలని నిర్ణయం తీసుకున్నాయి.

ప్రస్తుతం రాజ్యసభలో 244 మంది సభ్యులున్నారు. ఎన్డీఏ అభ్యర్థికి 126 మంది సభ్యుల మద్దతు ఉందని.. బీజేపీ ప్రకటించింది. వైసీపీ తాము బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తామని చెబుతున్నా.. కమలం నేతలు ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదు. తమకే ఓటేస్తారని బీజేపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. వారిని కూడా లెక్కలో వేసుకున్నారు. ఎన్నికకు వెళ్లడం కన్నా ఏకగ్రీవంగా జేడీయూ అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం మంచిదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కాంగ్రెస్‌కు ఉచిత సలహా ఇచ్చారు.

కాంగ్రెస్ అభ్యర్థి హరిప్రసాద్‌కు నికరంగా 111 మంది సభ్యుల మద్దతు కనిపిస్తోంది. యూపీఏకి చెందిన 61 మంది, తృణమూల్‌కు 13 మంది, టీడీపీకి ఆరు, సీపీఎంకు ఐదుగురు, బీఎస్పీ, డీఎంకే నుంచి నలుగురు, సీపీఐ, జేడీఎస్, ఓ నామినేటె‌డ్ సభ్యుడు హరిప్రసాద్‌కు మద్దతిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన పీడీపీ గైర్హాజర్ అవుతున్నట్లు ప్రకటించింది. ఆమ్ఆద్మీ పార్టీ తన స్టాండ్ ఏమిటో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చూస్తే.. ఎన్డీఏ గట్టెక్కడం సులువుగానే కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమిలో లేని అన్నాడీఎంకే, బీజేడీ … బీజేపీ పరువు నిలబెట్టబోతున్నాయి. ఈ ఉదయం పదకొండు గంటలకు ఎన్నిక జరుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close