త‌ల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతారా: చిరంజీవి ఆవేద‌న‌

పైర‌సీ చిచ్చురేపుతోంది. నిర్మాత‌ల‌కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. దానికి త‌గ్గ‌ట్టు… సినిమాలు విడుద‌ల‌కు ముందే.. లీకైపోతున్నాయి. దానికి చిత్ర‌సీమ‌లోని వ్య‌క్తులే బాధ్యులు అవ్వ‌డం బాధాక‌రం. ‘గీత గోవిందం’కీ ఇలాంటి ప‌రిస్థితి ఎదురైంది. ఈ విష‌య‌మై ఆవేద‌న వ్య‌క్తం చేశారు చిరంజీవి. ‘గీత గోవిందం’ స‌క్సెస్ మీట్ ఈరోజు (ఆదివారం) హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ముఖ్య అతిథిగా చిరంజీవి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమా లీకైన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. విడుద‌ల‌కు ముందు సినిమాలీకై అర‌వింద్ చాలా దీనావ‌స్థ‌లో ఉన్నార‌ని, ఆ స‌మ‌యంలో తాను ధైర్యం చెప్పాన‌ని గుర్తు చేసుకున్నారు. ”అర‌వింద్‌గారిలో దిగులు పోగొట్ట‌డానికి త‌మ్ముడి సినిమా ‘అత్తారింటికి దారేది’ కూడా ఇలానే విడుద‌ల‌కు ముందు లీకైంది క‌దా? కానీ… ఆ సినిమా విజ‌యాన్ని ఆప‌లేక‌పోయింది. ‘గీత గోవిందం’ కూడా అత్తారింటికి దారేదిలా విజ‌యాన్ని సాధిస్తుంది చూడండి’ అని ధైర్యం చెప్పా. కానీ వాస్త‌వానికి ఓ సినిమా ఇలా విడుద‌ల‌కు ముందే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం భావ్యం కాదు. త‌ల్లిలాంటి ప‌రిశ్ర‌మ‌లో ఉంటూ, ఏదో కుర్ర‌త‌నంగా సినిమాని లీక్ చేయ‌డం త‌ల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన‌ట్టే” అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు చిరు. ఈ సినిమాతో విజ‌య్ స్టార్‌గా మారిపోయాడ‌ని కితాబిచ్చారు. అర్జ‌న్ రెడ్డితో పోలిస్తే ఈ సినిమాలో త‌న న‌ట‌న చాలా వైవిధ్యంగా క‌నిపించింద‌ని, ఈ సినిమాతో కుటుంబ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైపోయాడ‌ని అన్నారు చిరు. చిన్న పాయింట్‌తో రెండున్న‌ర గంట‌లు వినోదాత్మ‌కంగా న‌డిపించిన ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌నీ చిరు అభినందించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close