ఎన్టీఆర్ బయోపిక్ కోసం ఆ సినిమాని పక్కన పెట్టేశాడు!

2019 సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్‌ విడుదల చేయాలనేది బాలకృష్ణ సంకల్పం. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అందుకు తగ్గట్టు శరవేగంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోపక్క క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం ‘మణికర్ణిక’ కూడా 2019 జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా 25న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే… కంగనా రనౌత్ టైటిల్ రోల్‌లో ఝాన్సీ లక్ష్మీభాయిగా నటిస్తున్న ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు. ప్రస్తుతం ప్యాచ్‌వ‌ర్క్‌ జరుగుతోంది. అదీ క్రిష్ గైర్హాజరులో! ‘యన్.టి.ఆర్’ పనుల్లో తలమునకలైన క్రిష్, ‘మణికర్ణిక’ చిత్రానికి సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. దాంతో రచయితలు విజయేంద్ర ప్రసాద్, ప్రసూన్ జోషి సహకారంతో కంగనా రనౌత్ చిత్రాన్ని పూర్తిచేసే బాధ్యతను చేపట్టారు. ఆమెతో క్రిష్ ప్రతిరోజూ ఫోనులో మాట్లాడుతున్నారని, తమతో ఆయ‌న ట‌చ్‌లోనే వున్నారని ‘మణికర్ణిక’ టీమ్ చెబుతోంది. మధ్య మధ్యలో క్రిష్ ముంబై వెళ్లి వస్తున్నారు. ఎప్పటికప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తూ హిందీ చిత్రబృందానికి అందుబాటులో వుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close