ఏపీలో జనజాగృతి పార్టీ..! ప్రారంభించిన అరకు ఎంపీ..!!

అరకు ఎంపీ కొత్తపల్లి గీత కొత్త పార్టీ పెట్టబోతున్నారని.. మూడు, నాలుగు నెలల కిందట నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని కొత్తపల్లి గీత నిజం చేశారు. జన జాగృతి పార్టీని ప్రకటించారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ప్రజల కోసమే పార్టీని పెట్టానని ప్రకటించారు. గొడుగు గుర్తును తన పార్టీ కోసం ఎంచుకున్నారు. వైసీపీ తరపున అరకు నుంచి ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత ఆ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. మధ్యలో.. తెలుగుదేశం పార్టీలో చేరుతారని.. ప్రచారం జరిగింది. ఆ తర్వాత బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని చెప్పుకున్నారు. చివరికి కొత్త పార్టీ పెట్టుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో కొత్తపల్లి గీత.. ప్రభుత్వ అధికారిగా పని చేశారు. డిప్యూటీ కలెక్టర్‌గా ఉండి పదవికి రాజీనామా చేసి.. వైసీపీలో చేరారు. హైదరాబాద్ శివార్లలో ఆర్డీవోగా ఉన్నప్పుడు.. ప్రభుత్వ భూమిని తన భర్త సంస్థకు రాసిచ్చేశారన్న ఆరోపణలు తీవ్రంగా వచ్చాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసేసుకుంది. అయితే.. అప్పటికే ఆ భూమిని బ్యాంకుల్లో పెట్టి.. వందల కోట్లు అప్పులు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో.. బ్యాంకులు.. సీబీఐకి ఫిర్యాదు చేశాయి. కొత్తపల్లి గీత దంపతులపై సీబీఐ కేసు నమోదయింది. సమన్లు కూడా జారీ అయ్యాయి. అప్పుడే ఆమెకు వ్యక్తిగత హోదాలో రెండు పాన్‌కార్డులు ఉన్నట్లు బయటకు వచ్చింది.

ఆ తర్వాత సీబీఐ విచారణకు వెళ్లారో లేదో కానీ… కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. పార్లమెంట్‌లో వివిధ సందర్భాల్లో కేంద్రానికి అనుకూలంగా మాట్లాడారు. ప్రధానితో రెండు, మూడు సార్లు సమావేశై.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. కొత్తపల్లి గీతకు ఎస్టీ సర్టిఫికెట్ పై కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఏపీ ప్రభుత్వం విచారణ జరిపి ఆమె ఎస్టీనే అనే సర్టిఫికెట్ ఇచ్చిది. ఏపీలో అధికార పార్టీని దెబ్బకొట్టడానికి వీలైనన్ని పార్టీలు పెట్టించాలనే వ్యూహాన్ని.. బీజేపీ అమలు చేస్తోందని… కొన్నాళ్ల క్రితం.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు ఆర్టికల్‌లో రాశారు. అప్పుడే.. కొత్తపల్లిగీత బీజేపీ ప్రొద్భలంతో కొత్త పార్టీ పెట్టబోతున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడది నిజమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close