రానా సినిమాల‌కు వ‌ర‌ద‌ల దెబ్బ‌

రానా చేతిలో ప్ర‌స్తుతం రెండు సినిమాలున్నాయి. ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. ఈ రెండు సినిమాల‌పై ఇప్పుడు కేర‌ళ వ‌ర‌ద‌ల ఎఫెక్ట్ ప‌డింది. కేర‌ళ వ‌ర‌ద‌ల వ‌ల్ల ఈ రెండు సినిమాలూ ఆగిపోయాయి. ‘1945’, `హాథీ మేరీ సాథీ` ఇవి రెండూ కేర‌ళ నేప‌థ్యంలో సాగే క‌థ‌లే. కేర‌ళ అడ‌వుల్లో `హాథీ మేరీ సాథీ` తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల‌… కేర‌ళ మొత్తం నీట‌మునిగిపోయింది. అక్క‌డ జ‌న జీవ‌నానికి తీవ్ర ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి. ఇలాంటి ద‌శ‌లో షూటింగ్ ఎలా సాగుతుంది? అందుకే ఎక్క‌డి షూటింగులు అక్క‌డ ఆగిపోయాయి. వాటిలో రానా సినిమాలు కూడా ఉన్నాయి. కేర‌ళ లోని ప‌రిస్థితులు చెక్క‌బ‌డ‌డానికి క‌నీసం రెండు నెల‌ల స‌మ‌యం అయినా ప‌డుతుంది. ఈలోగా ఈ రెండు సినిమాలూ సెట్స్‌పైకి వెళ్లే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. ఈలోగా… ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్‌పై దృష్టి పెట్ట‌నున్నాడు రానా. ప్ర‌స్తుతం ‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు రానా. వీలైనంత త్వ‌ర‌గా త‌న పార్ట్ ముగించాల‌ని ద‌ర్శ‌కుడు క్రిష్ కూడా భావిస్తున్నాడు. ”కేరళ వ‌ర్షాల వ‌ల్ల నా సినిమాలు ఆగిపోయాయి. మ‌రేం ఫ‌ర్లేదు.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్ చేస్తున్నా క‌దా. ‘నేనే రాజు నేనే మంత్రి ‘ త‌ర‌వాత నా నుంచి వ‌చ్చే సినిమా ఏదైనా ఉందీ అంటే అది ఎన్టీఆర్ బ‌యోపిక్ నే” అని చెప్పుకొచ్చాడు రానా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close