రాహుల్‌ గాంధీపై స్మృతి ఇరానీ అస్త్రం..!

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పూర్తిగా పట్టు కోల్పోయినా.. రెండు అంటే..రెండు నియోజకవర్గాల్లో మాత్రం.. ఎప్పుడూ గెలుస్తూ వస్తోంది. అది గాంధీ కుటుంబానికి ఉన్న పలుకుబడి కావొచ్చు.. మిత్రపక్షాల సహకారం కావొచ్చు. అమేధీలో రాహుల్ గాంధీ, రాయ్ బరేలీలో సోనియా గాంధీ మాత్రం గెలుస్తూ వస్తున్నారు. అయితే వారి మెజార్టీలు ఏమీ.. బంపర్‌గా ఉండవు. కానీ గెలుపునకు మాత్రం ఢోకా ఉండదు. బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ సారి రాహుల్‌ గాంధీని ఓడించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే.. చాలా రోజుల కిందటే.. స్మృతి ఇరానీకి అమేధీ బాధ్యతలు అప్పగించారు. కేంద్రమంత్రిగా ఉన్నా.. ఆమె… చాలా రోజుల కిందటే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. ఆమె అమేధీలో జోరు పెంచుతున్నారు.

2014 ఎన్నికల్లోనూ స్మృతి ఇరానీ.. రాహుల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. కానీ అప్పుడు చివరి క్షణాల్లో ఆమెకు టిక్కెట్ ఖరారయింది. ఈ సారి ముందు నుంచే గ్రీన్ సిగ్నల్ ఉండటంతో.. ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. ఇక ఎంపీగా.. కేంద్రమంత్రిగా తన స్థాయిలో నియోజకవర్గల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా .. డిజిటల్ ఇండియాలో భాగంగా.. ఓ గ్రామాన్ని దత్త తీసుకుని పూర్తిగా డిజిటల్ విలేజ్‌గా మార్చారు. గ్రామస్తులందరికీ.. ఉచిత వైఫై అందిస్తున్నారు. నిజానికి దీని కంటే ముందుగా ఆమె.. అమేధీలో ఆమె అనేక కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో చాలా వివాదాస్పదమయ్యాయి కూడా.

త్వరలో పది వేల ఆవులను పంపిణీ చేయడానికి…సన్నాహాలు చేస్తున్నారు. ఇవేమీ ఆమె సొంత సొమ్ము కాదు. నర్మదా ఫెర్టిలైజర్స్ అనే సంస్థ … కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ పథకం కింద…ఈ ఆవులను ఇస్తోంది. నర్మదా ఫర్టిలైజర్స్ సంస్థకు ..ఉత్తరప్రదేశ్ కు కానీ.. అమేథీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఆ సంస్థ గుజరాత్ కు చెందినది. ఆ సంస్థలో 42శాతం వాటా గుజరాత్ ప్రభుత్వానికి ఉంది. అంటే ఓ రకంగా ప్రభుత్వ సంస్థ. సీఎస్ఆర్ నిధులు ఏమైనా ఖర్చు పెట్టాలంటే.. గుజరాత్ లో పెట్టుకోవచ్చు.. కానీ అవుల రూపంలో అమేధీకి తరలిస్తున్నారు. అంటే.. రాహుల్ గాంధీని టార్గెట్ గా చేసుకుని.. అమేధీలో ఓట్ల కొనుగోలను.. బీజేపీ తరపున స్మృతి ఇరానీ ప్రారంభించేశారన్నమాట. ఇంకా నేరుగా ఓటర్లను లబ్ది చేకూర్చే పథకాలను పెద్ద ఎత్తున అమేధీ ప్రజలకు అందిస్తున్నారు. అంటే పక్కా ప్లాన్‌తోఉన్నట్లే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close