రేవంత్ ఇంట్లో అడుగడుగు సోదా..! అసలు కేసేంటో..?

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో మరో రోజు సోదాలు జరపనున్నారు ఐటీ అధికారులు. 20 గంటలుగా రేవంత్‌రెడ్డిని దగ్గర పెట్టుకుని.. ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఉదయం రేవంత్‌రెడ్డి భార్య గీతను బ్యాంకులకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించి, పరిశీలించారు 3 బ్యాంకుల్లో లాకర్ల వివరాలు తెలుసుకున్నారు. డాక్యుమెంట్లు, సంతకాలు, ఇతర వ్యవహారాలపై వివరాలు తెలుసుకుంటున్నారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు లాకర్ల సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఇంట్లోని హార్డ్‌డిస్క్‌లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్‌ పరిశోధనల నిమిత్తం ఎఫ్ఎస్‌ఎల్‌కు తరలించారు. రేవంత్‌రెడ్డి ఇంట్లో మూడురోజులు సోదాలు నిర్వహించేందుకు…అధికారులు సెర్చ్‌ వారెంట్‌ తీసుకున్నారు.

అసలు రేవంత్ రెడ్డిపై ఉన్న ఫిర్యాదులేమిటి.. ఏ అంశంపై.. సోదాలు నిర్వహిస్తున్నారన్నదానిపై సోదాలు చేస్తున్న ఐటీ, ఈడీ వర్గాలు ఒక్క ప్రకటన కూడా విడుదల చేయలేదు. అసలు రేవంత్ పై ఉన్న అభియోగాలేమిటి..? ఏ కేసుల్లో ఆయన ఇంటిపై దాడులు చేశారా..? అన్నదానిపై.. ఐటీ శాఖ నుంచి కానీ.. ఈడీ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే.. ఓటుకు నోటు కేసులో సంబంధం ఉన్న సెబాస్టియన్, ఉదయసింహా ఇళ్లలో నిన్న సోదాలు చేశారు. ఈ రోజు ఉదయ్‌సింహాకు ఫోన్‌ చేసి రేవంత్‌ నివాసానికి పిలిపించారు. రేవంత్‌రెడ్డితో పాటు ఉదయ్‌సింహాను విచారిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రధానంగా.. ఓటుకు నోటు కేసు విషయంలోనే ఐటీ, ఈడీ అధికారులుసోదాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరో వైపు రేవంత్ పై ఫిర్యాదు చేసిన రామారావు అనే లాయర్ కొన్ని పత్రాలను మీడియాకు ఇస్తున్నారు. రేవంత్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రూ. 300 కోట్లు మనీలాండరింగ్ కు పాల్పడినట్లు తాను తేల్చానని చెబుతున్నారు. ఏవేవో డాక్యుమెంట్లు ఇస్తున్నారు. అయితే కొసమెరుపేమిటంటే.. ఆ రామారావు అనే లాయర్ పై … 32 కేసులు ఉన్నాయి. సెంట్రల్ వర్శిటీ ఉద్యోగుల భూముల్ని కూడా కబ్జా చేశారు.హైకోర్టుల్లో పిటిషన్లు వేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండటం ఆయన హాబీ. పోలీసులు ఆయన తీరుపై విసిగిపోయి రౌడీషీట్ ఓపెన్ చేశారు. రేపోమాపో పీడీయాక్ట్ పెట్టాలనుకుంటున్నారు. మరో వైపు రోజంతా కాంగ్రెస్ పార్టీ నేతలు రేవంత్ ఇంటి వద్దకు వచ్చి… సంఘిభావం తెలియజేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close