అరవింద సమేత: ‘పెనివిటి…’ పాటతో షూటింగుకు ఫుల్‌స్టాప్‌!

అక్టోబర్ 11న ‘అరవింద సమేత వీరరాఘవ’ విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేశారు. అంటే… విడుదలకు గట్టిగా రెండు వారలు కూడా లేదు. అందుకని, శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఓ పాట చిత్రీకరణ కోసం ‘అరవింద సమేత’ యూనిట్ ఇటలీ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన వెంటనే ఇండియాలో షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్, ఈషా రెబ్బా ఇతర ప్రధాన తారాగణంపై నృత్య దర్శకుడు రాజు సుందరం నేతృత్వంలో ‘పెనివిటి…’ పాటను తెరకెక్కిస్తున్నారు. ఈ పాటతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుందని, గుమ్మడికాయ కొడతారని సమాచారం. మరోపక్క ఈషా రెబ్బా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. సినిమాలో ముఖ్య కథానాయిక పూజా హెగ్డే తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది. ఓ పక్క ‘పెనివిటి…’ పాట చిత్రీకరణ చేస్తూ మరోపక్క నిర్మాణానంతర కార్యక్రమాలను చేయిస్తున్నారు త్రివిక్రమ్. పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి అవుతాయని నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని అధినేత రాధాకృష్ణ నమ్మకంగా వున్నార్ట‌. అక్టోబర్ 2న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆశీష్… గెట్ రెడీ ఫ‌ర్ యాసిడ్ టెస్ట్!

వెనుక ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా, ఒక‌టి రెండు సినిమాల వ‌ర‌కే! ఆ త‌ర‌వాత ఎవ‌రి కాళ్ల మీద వాళ్లు నిల‌బ‌డాల్సిందే, నిరూపించుకోవాల్సిందే. ఆ త‌రుణం.. ఇప్పుడు ఆశీష్‌కి వ‌చ్చేసింది....

వైసీపీ రిగ్గింగ్ ఆర్తనాదాలు – టీడీపీ హ్యాపీ !

ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎవరైనా ఆర్తనాదాలు చేస్తూంటే.. ప్రత్యర్తి పార్టీకి ఎంతో హ్యాపీగా ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీ గగ్గోలు పెట్టింది. వైసీపీ ఎంజాయ్ చేసింది. ఈ సారి రివర్స్ అయింది. వైసీపీ...

హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో అత్యవసర పిటిషన్ ను దాఖలు చేశారు. ఆయనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్...

అతిగా ఆలోచించి ఆరోగ్యం చెడగొట్టుకున్న కొడాలి నాని

కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారు. పార్టీ నేతలతో మాట్లాడుతూ ఒక్క సారిగా సోఫాలో కుప్పకూలిపోయారు. ఏమయిందోనని పార్టీ నేతలు కంగారు పడ్డారు. వెంటనే వచ్ిచ టెస్టు చేసిన వైద్యులు అతిగా ఆలోచించడంతో ఆరోగ్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close