వ‌ర్మ‌ని బెదిరించిన మాట నిజం కాదా..??

`లక్ష్మీస్ ఎన్టీఆర్‌`… ఈ టైటిల్ ఈమ‌ధ్య వినిపించ‌లేదు. ఎందుకంటే.. `ఎన్టీఆర్` బ‌యోపిక్ ప్ర‌క‌టించిన వెంట‌నే ఎంత హ‌డావుడిగా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` ప్ర‌క‌టించాడో, అంతే తొంద‌ర‌గా ఆ సినిమా గురించి మ‌ర్చిపోయాడు. వ‌ర్మ ఫామ్ లో లేక‌పోవ‌డం వ‌ల్లో ఏమో…. ఇంత‌టి స‌న్సేష‌న‌ల్ ప్రాజెక్టుకు కూడా ఏమాత్రం హైప్ రాకుండా పోయింది. `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` ప్రాజెక్టుని ఆపేయాల‌ని వ‌ర్మ‌ని కొంత‌మంది టీడీపీ నేత‌లు బెదిరించిన‌ట్టు తెలిసింది. ఎన్టీఆర్ వార‌సుల‌లోనే ఓ కీల‌క‌మైన వ్య‌క్తి… వ‌ర్మ‌ని ముంబైలో క‌ల‌సి `ఈ సినిమా చేయొద్దు` అన్నార్ట‌. దాంతో వ‌ర్మ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌ని ప‌క్క‌న పెట్టేశార‌ని వార్త‌లు వినిపించాయి. దాన్ని నిజం చేస్తూ… చాలా కాలం నుంచి వ‌ర్మ కూడా ఈ సినిమా ఊసెత్త‌లేదు. ఇప్పుడు స‌డ‌న్‌గా `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌ని రంగంలోకి దించాడు. జ‌న‌వ‌రిలో షూటింగ్ పూర్తి చేస్తాన‌ని క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఇదంతా చూస్తుంటే.. వ‌ర్మ మ‌రోసారి ఈ బ‌యోపిక్‌ని వాడుకుంటూ… ప‌బ్లిసిటీ స్టంట్ మొద‌లెట్టాడా? లేదంటే నిజంగానే ఈ సినిమా మొద‌లెట్టేస్తాడా? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. `ఇదంతా ప‌బ్లిసిటీ స్టంట్ అని.. వ‌ర్మ ఈ సినిమా తీసే ఛాన్స్ లేద‌ని` నంద‌మూరి కాంపౌండ్ వ‌ర్గాలు అంటున్నాయి. నిజంగా `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` గ‌నుక తీస్తే… వ‌ర్మ బెదిరింపుల‌పై వ‌చ్చిన వార్త‌లేవీ నిజం కాన‌ట్టే. ముంబై మాఫియా బెదిరింపుల‌కే లొంగ‌ని వ‌ర్మ‌… టీడీపీ నేత‌ల‌కు లొంగుతాడా??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫైనల్ లెక్క : పోస్టల్ బ్యాలెట్లు 5 లక్షల 40 వేలు !

పోస్టల్ బ్యాలెట్ల ఫైనల్ లెక్క తేలింది. మొత్తం జిల్లాల వారీగా వచ్చిన లెక్కలను చూస్తే 5,39,189 ఓట్లుగా గుర్తించారు. పోస్టల్ బ్యాలెట్ల గడువు పూర్తియన తర్వాత చెప్పిన దాని కంటే దాదాపుగా...

శ‌ర్వానంద్.. అంత టైమ్ లేద‌మ్మా!!

శ‌ర్వానంద్ కొత్త సినిమా 'మ‌న‌మే' రిలీజ్ డేట్ ఖాయ‌మైంది. జూన్ 7న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్టు నిర్మాత‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు. అంటే మ‌రో 15 రోజుల టైమ్ ఉంద‌న్న‌మాట‌. నిజానికి ఓ...

ఎక్స్‌క్లూజీవ్‌: ‘ఫిదా’ కాంబో మ‌ళ్లీ!

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో మ‌ర్చిపోలేని సినిమా 'ఫిదా'. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ గా నిలిచిపోయింది. ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌, శేఖ‌ర్ క‌మ్ముల మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయ‌బోతున్నారు. ఏ...

అసెంబ్లీకి డుమ్మా…కేసీఆర్ దారిలోనే జగన్ రెడ్డి..?

ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోతే జగన్ పరిస్థితి ఏంటి..? అధికారం కోల్పోవడాన్ని అవమానంగా ఫీలయ్యే జగన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా..? లేక కేసీఆర్ తరహాలోనే డుమ్మా కొడుతారా..? ఇప్పుడిదే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close