మీటూ ఉద్య‌మం… ఆత్మ ర‌క్ష‌ణ‌లో టాలీవుడ్ హీరోలు

మీటూ ఉద్య‌మం చిత్ర‌సీమ‌ని కుదిపేస్తోంది. బాలీవుడ్ అయితే ట్వీటు ట్వీటుకీ ఉలిక్కిప‌డుతోంది. బాలీవుడ్‌లో క‌థానాయ‌కులంతా మీటూకి మ‌ద్ద‌తు తెలిపారు. అక్ష‌య్ కుమార్ షూటింగుల‌ను క్యాన్సిల్ చేసి సంచ‌న‌ల నిర్ణ‌యం తీసుకున్నాడు. అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి వాళ్లు కూడా మీటూపై స్పందించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే ఆయ‌న ట్వీట్ల‌పై కూడా కౌంట‌ర్లు కూడా ప‌డ్డాయి. అమితాబ్ స్పంద‌న కంటే, ఆ స్పంద‌న‌పై వ‌చ్చిన కౌంట‌ర్లే బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది గా మారాయి. అయితే ఈ ఉద్య‌మంపై ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ హీరోలెవ‌రూ పెద‌వి విప్ప‌లేదు. దానికీ కార‌ణం ఉంది. ఏరి కోరి.. ఎందుకు రొంపిలోకి దిగ‌డం అని. ఎవరు స్పందించినా కౌంట‌ర్లు వేయ‌డానికి శ్రీ‌రెడ్డి లాంటి వాళ్లు రెడీగా ఉంటారు. అమితాబ్‌కి ఎదురైన ప‌రిస్థితే మ‌న హీరోల‌కూ ఎదురైనా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. స‌మంత‌, ర‌కుల్‌, కాజ‌ల్‌.. వీళ్లంతా ద‌క్షిణాది క‌థానాయిక‌లే. ఆమాట‌కొస్తే.. వీళ్లే తెలుగు హీరోయిన్లు. వీళ్లంతా ట్వీట్ల ద్వారా `మీటూ` ఉద్య‌మానికి వ‌త్తాసు ప‌లుకుతుంటే.. వాళ్ల‌తో క‌ల‌సి న‌టించిన‌వాళ్లంతా మిన్న‌కున్నారు. క‌నీసం నాగ‌చైత‌న్య‌, నాగార్జున కూడా స‌మంత‌వైపు మాట్లాడ‌లేక‌పోతున్నారు. దీనికంతా ఆత్మ‌ర‌క్ష‌ణ ధోర‌ణే కార‌ణం. తెలుగు చిత్ర‌సీమ‌లో కొంత‌మంది క‌థానాయిక‌లు లైంగిక వేధింపుల‌కు గుర‌య్యార‌న్న‌ది నిజం. అందుకే స‌మంత‌లాంటివాళ్లు స్పందించారు. కానీ మ‌న హీరోల‌కు ధైర్యం చాల‌డం లేదు. మ‌రి మ‌న హీరోల్లో తొలి అడుగు ఎవ‌రేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close