దిల్‌రాజు కాంపౌండ్‌లో మరో స్క్రిప్ట్ రెడీ

కథానాయకులు ఎవరనేది చెప్పలేదు కానీ… కథ మాత్రం సిద్ధం చేసేశారు! దిల్‌రాజు కాంపౌండ్‌లో మరో స్క్రిప్ట్ సిద్ధమైంది. స్క్రీన్ప్లేతో సహా! ‘సమ్మోహనం’తో సమీక్షకులను, సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఆయన దర్శకత్వంలో దిల్‌రాజు ఒక సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్‌ ఇంద్రగంటి పూర్తి చేశారు. గత మూడు నాలుగు నెలలుగా ఆయన కథపై వర్క్‌ చేశారు. స్క్రీన్ప్లేని 20 రోజుల్లో పూర్తి చేసేశార్ట! యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు చోటుంది. వాళ్లు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. మోహనకృష్ణ ఇంద్రగంటి స్వహస్తాలతో 250 పేజీల స్క్రీన్ ప్లే రాశారు. ఫెయిర్‌ చేస్తే… 160 పేజీలకు వస్తుందట! ఈ మల్టీస్టారర్‌ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ‘హలో గురు ప్రేమ కోసమే’ విడుదల తర్వాత బయటకు వస్తాయేమో!! దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ని ప్రొడక్షన్‌ హౌస్‌ అనడం కంటే ప్రొడక్షన్‌ ఫ్యాక్టరీ అంటే సబబుగా ఉంటుందేమో! ఒకట్రెండు కాదు, యేడాదికి ఐదారు సినిమాలు నిర్మిస్తున్నారు మరి! గతేడాది దిల్‌రాజు కాంపౌండ్‌ నుంచి ఆరు సినిమాలోచ్చాయి. ఈ యేడాది ఆల్రెడీ రెండు వచ్చాయి. మరొకటి (హలో గురు ప్రేమ కోసమే) దసరాకు విడుదల కానుంది. ఇంకొకటి (ఎఫ్‌2) సెట్స్‌ మీదుంది! ఇంకొందరు దర్శకులు కథలు రాస్తున్నారు. కథలపై వర్క్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close