మరో రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన..! మిగతావి ఎప్పుడు..?

తెలంగాణ రాష్ట్ర సమితి మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ నియోజకవర్గానికి కె.మాణిక్ రావు, మలక్ పేటకు చావ సతీష్ కుమార్ పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. గత ఎన్నికల్లో జహీరాబాద్ లో గీతారెడ్డిపై పోటీ చేసి మాణిక్ రావు.. మలక్ పేటలో బలాలాపై పోటీ చేసి సతీష్ కుమార్ ఓడిపోయారు. మళ్లీ వారిద్దరికే ఆయా స్థానాల్లో అవకాశం కల్పించారు. ఈ ఇద్దరు అభ్యర్థుల ప్రకటన… ఓ వైపు ఆశ్చర్యాన్ని మరో వైపు మిగిలిన నియోజకవర్గాల్లోని ఆశావాహుల్లో ఆక్రోశాన్ని నింపింది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారే ప్రకటించడానికి ప్రత్యేకంగా ఎందుకు పెండింగ్‌లో పెట్టాలన్న సందేహం.. కాగా.. ఈ రెండింటినే ప్రత్యేకంగా ఎందుకు ప్రకటించడమన్న చర్చ మరో కారణం.

నిజానికి జహీరాబాద్ విషయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా పెద్ద గేమ్ ప్లాన్ ఆడారు. ఆ సీటును పెండింగ్‌లో పెట్టిన మరుక్షణం నుంచి.. గీతారెడ్డి.. టీఆర్ఎస్ లో చేరబోతున్నారన్న ప్రచారం ప్రారంభమయ్యేలా చేశారు. దీంతో.. టీఆర్ఎస్ తరపున ఆమె అభ్యర్థి అవుతారని అనుకున్నారు. కానీ గీతారెడ్డి నిర్మోహమాటంగా… మైండ్‌గేమ్ రాజకీయాలకు భయపడేదాన్ని కాదని ప్రకటించేశారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. వాస్తవానికి ఆయన హరీష్ రావు అనుచరుడు. హరీష్ రావు అనుచరులకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో.. ఇటీవలి కాలంలో.. ఆయన కేటీఆర్‌తో సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తున్నారు. పలుమార్లు సమావేశమై.. పోటీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ కేటీఆర్‌ ఆ విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోలేదని.. తాజాగా తేలిపోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాణిక్ రావుకే చాన్సిచ్చారు. ఇక మలక్ పేట .. ఎంఐఎం సిట్టింగ్ సీటు. ఆ పార్టీతో ఫ్రెండ్లీ ఫైట్ ఉంటుందని కేసీఆర్ పదే పదే చెబుతూ ఉంటారు. అందుకే.. అక్కడ… ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ కుమారుడు ఆజం ఆలీ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపినా కేసీఆర్ పట్టించుకోలేదు. డమ్మీ క్యాండిడేట్‌గచావ సతీష్ కు చాన్సిచ్చారు.

ఈ రెండు స్థానాల్లోనే అభ్యర్థులను ప్రకటించడంతో.. రేసులో ఉన్న మిగతా పెండింగ్ స్థానాల అభ్యర్థులు ఉసూరుమన్నారు. అంబర్ పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్, చార్మినార్, చొప్పదండి, వరంగల్ తూర్పు, వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, హుజూర్ నగర్, కోదాడలకు తెరాస అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో ఒక్క చార్మినార్ మినహా మిగతా అన్ని స్థానాల్లో అభ్యర్థిత్వం కోసం గట్టి పోటీ ఉంది. తమ అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తారని.. ఆశపడిన ఈ నియోజకవర్గాల ఆశావహులంతా… తెలంగాణ భవన్‌కు వచ్చి నిరాశతో వెళ్లిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close