ఈసీ అంటే ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తుంది..! తెలంగాణ పార్టీల ఘోష కూడా అంతే..!!

ప్రపంచంలో ఎక్కడైనా… ఏ రంగంలో అయినా ప్రమాణాలు మెరుగుపడుతూ ఉంటాయి. కానీ ఇండియాలో మాత్రం దిగజారుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఎన్నికల నిర్వహణ వ్యవస్థ కూడా ఒకటి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా టీఎన్ శేషన్ అనే పెద్దాయన ఉన్నప్పుడు.. ఎన్నికలు జరిగిన తీరును చూసిన వాళ్లు.. ప్రజాస్వామ్యం గొప్పతనం అంటూ ఛాతి పెంచేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను పరిశీలిస్తున్న వాళ్లు… ఇదేంటి అంపైర్ కూడా.. అధికార పార్టీ కోసం బ్యాటింగ్ చేస్తున్నాడని… ముక్కు మీద వేలు వేసుకోవాల్సిన పరిస్థితి.

సంప్రదాయం ప్రకారం.. ఎన్నికల సంఘం.. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు నిర్వహించాలంటే.. ముందుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నేతృత్వంలో బృందం ఆ రాష్ట్రానికి వెళ్లి ప్రత్యక్షంగా ఏర్పాట్లు ఇతర.. అంశాలను పరిశీలించిన తర్వాత… ఎప్పుడు అనుకూలమో అప్పుడు డేట్లు ఫిక్స్ చేస్తారు. కానీ ఘనత వహించిన మన సీఈసీ ఓపీ రావత్ మాత్రం.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తీరిగ్గా విదేశీ పర్యనటకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత తెలంగాణకు వచ్చారు. రాజకీయ పార్టీల గోడు విన్నారు. రాసుకున్నారో లేదో మరి.. రాసుకుంటే మటుకు కచ్చితంగా అది పవన్ కల్యాణ్… షార్ట్ హ్యాండ్ రాతే అయి ఉంటుంది. ఎందుకంటే.. విపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలు పట్టించుకుంటే.. ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నాననబ్బా అన్న అనుమానం ఆయనకే రావొచ్చు.

తెలంగాణలో ఇంత వరకూ తుది ఓటర్ల జాబితా లేదు. తుది ఓటర్ల జాబితా అంటూ ప్రకటించిన దానిలో కొన్ని తప్పులున్నాయని చెప్పుకోవడం ఈసీకే చెల్లింది. ఇదే అంశాన్ని పదే పదే చెబుతూ.. విపక్ష పార్టీలన్నీ ఈసీకి నివేదికలు సమర్పించాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ , కమ్యూనిస్టులు అందరూ… బోగస్ ఓట్లపైనే ఫిర్యాదులు చేశారు. ప్రస్తుత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికే మచ్చ అవుతుందన్నారు. జాబితాలో తప్పులు సరిచేశామని హైకోర్టుకు ఈసీ తెలిపింది. ఈ నెల 12న తుది జాబితా అన్ని పార్టీలకూ ఇస్తామన్నారు. కానీ ఇంత వరకూ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని మర్రి శశిధర్ రెడ్డి సీఈసీకి గుర్తు చేశారు. టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని.. టీటీడీపీ ఫోన్ ను ట్యాప్ చేసిన ఆధారాలను… ఈసీకి అందించారు రావుల చంద్రశేఖర్ రెడ్డి.

ఈసీ స్పందన అందరికీ తెలిసిందే. ఎలాంటి చర్యలు ఉండవు. తాము ఫార్మాలిటీగా రావాలి కాబట్టి వచ్చాము.. వారు కూడా చెప్పాలి కాబట్టి చెప్పారు అనుకుంటారు ఈసీ. అంతకు మించి చర్యలేమీ ఉండవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close