ఐదేళ్ల త‌ర‌వాత రాజ‌కీయాల్లోకి..: వ‌ర‌ల‌క్ష్మి ప్ర‌క‌ట‌న‌

శ‌ర‌త్‌కుమార్ త‌న‌య వ‌ర‌ల‌క్ష్మి… తెలుగువాళ్ల‌కీ ప‌రిచ‌య‌మే. ఈమ‌ధ్య విడుద‌లైన `పందెం కోడి 2`లో ప్ర‌తినాయ‌కురాలిగా న‌టించింది. ఇప్పుడు `స‌ర్కార్‌`లోనూ ఓ కీల‌క‌మైన పాత్ర పోషిస్తోంది. విశాల్ తో వ‌ర‌ల‌క్ష్మి ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతున్న‌ట్టు ఆమ‌ధ్య వార్త‌లొచ్చాయి. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు వాటిని ఖండిస్తూనే ఉంది వ‌ర‌ల‌క్ష్మి. అయితే తాజాగా రాజ‌కీయాల‌పై ఓ నిర్ణ‌యం తీసుకుంది వ‌ర‌. త్వ‌రలో రాజ‌కీయాల్లోకి వ‌స్తా… అంటూ ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

”మ‌హిళ‌ల‌లో చైత‌న్యం అవ‌స‌రం. స‌మాజానికి ఏదో ఒక‌టి చేయ‌గ‌ల నేర్పు వాళ్ల‌కు ఉంది. నాకూ ఏదైనా చేయాల‌నిపిస్తుంటుంది. అందుకోసం రాజ‌కీయాల్లోకి వ‌స్తాను. అయితే ఇప్పుడు కాదు. దానికి స‌మ‌యం ఉంది. క‌నీసం అయిదేళ్ల‌యినా ఆగాలి. ద‌ర్శ‌క‌త్వం వైపు కూడా మ‌న‌సు లాగుతోంది. త్వ‌ర‌లో ఓ సినిమాని డైరెక్ట్ చేస్తా. ఈలోగా సినిమాకి సంబంధించిన అన్ని విష‌యాలూ నేర్చుకుంటా“ అంటోంది వ‌ర‌ల‌క్ష్మి. విశాల్‌తో అనుబంధం గురించి మాట్లాడితే.. “విశాల్ నాకు స్నేహితుడు మాత్ర‌మే. మేమిద్ద‌రం చాలా విష‌యాల్ని చర్చించుకుంటాం. కానీ మామ‌ధ్య ఎప్పుడూ ప్రేమ‌, పెళ్లి ప్ర‌స్తావ‌న రాలేదు“ అని క్లారిటీ ఇచ్చేసింది. శ‌ర‌త్ కుమార్ సినిమాల్లో రాణించి, ఆ త‌ర‌వాత రాజ‌కీయాల్లోకి వెళ్లారు. కానీ వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. మ‌రి వార‌సురాలు ఏమాత్రం ప్ర‌భావితం చేస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close