శ్రీ‌నువైట్ల సెటైర్లు ఎవ‌రిపైనో తెలుసా?

శ్రీ‌నువైట్ల‌కు కామెడీలో మంచి ప‌ట్టు ఉంది. త‌న సినిమాల సక్సెస్‌కి ప్ర‌ధాన కార‌ణం ఎంట‌ర్‌టైన్‌మెంటే. ‘దుబాయ్ శీను’లో.. ఎమ్మెస్ నారాయ‌ణ ఎపిసోడ్ గుర్తుంది క‌దా? అది హీరోల‌పై త‌ను వేసిన‌, తాను మాత్ర‌మే వేయ‌గ‌లిగిన సెటైర్‌. ‘దూకుడు’లో ఎమ్మెస్ ఎపిసోడ్ కూడా అంతే క్లిక్ అయ్యింది. ప్ర‌తీ సినిమాలోనూ.. ఏదో ఓ రూపంలో సెటైరిక‌ల్ కామెడీ పండించడంలో శ్రీ‌నువైట్ల దిట్ట‌. ఈసారి `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ`లోనూ ఓ సెటైరిక‌ల్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశాడు శ్రీ‌నువైట్ల‌.

అమెరికాలో నాటా, తానా అనే తెలుగు అసోసియేష‌న్లు ఉన్నాయి. ఈసారి.. శ్రీ‌ను గురి వాటిపై ప‌డింది. ‘వాటా’ అంటూ (ఓల్ ఆంధ్రా తెలంగాణ అసోసియేష‌న్‌) అంటూ ఓ పేరు పెట్టి.. ఓ హిలేరియ‌స్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశాడట శ్రీ‌నువైట్ల‌. సునీల్‌, వెన్నెల కిషోర్‌, స‌త్య‌, ర‌ఘుబాబు, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి.. ఇలా కామెడీ గ్యాంగ్ అంతా ఈ ఎపిసోడ్‌లో క‌నిపించ‌నుంది. దాదాపు 5 నిమిషాలు సాగే ఈ ఎపిసోడ్‌… సినిమా మొత్తానికి హైలైట్‌గా నిల‌వ‌బోతోంద‌ని తెలుస్తోంది. ఇదే ఎపిసోడ్‌లో సినిమావాళ్ల‌పైనా కొన్ని సెటైర్లు వేశాడ‌ట శ్రీ‌ను. ‘అమ‌ర్అక్బ‌ర్ ఆంటోనీ’ ఓ థ్రిల్ల‌ర్‌. సినిమా అంతా సీరియెస్‌గా సాగుతుంటుంది. అయితే శ్రీ‌నువైట్ల మార్క్ కూడా క‌నిపించాలి క‌దా? అందుకే ఈ ర‌కంగా… త‌న స్టైల్‌ని ఈ క‌థ‌లో ఇమిడ్చేశాడు. ఈనెల 16న అమ‌ర్ అక్బ‌ర్ విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ఈ ఎపిసోడ్ ఏమాత్రం న‌వ్వించిందో తెలియాలంటే అప్ప‌టి వ‌ర‌కూ ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close