పైర‌సీ ప్ర‌మాదంలో ‘రోబో 2.ఓ’

పైర‌సీ పెనుభూతంలా మారుతోంది. రోజు రోజుకీ త‌న విశ్వ‌రూపం చూపిస్తూనే ఉంది. పైర‌సీ కార‌ణంగా… చిత్ర‌సీమ యేటా కొన్ని వంద‌ల‌ కోట్లు న‌ష్ట‌పోతోంది.ఈమ‌ధ్య విడుద‌లైన ‘స‌ర్కార్‌’, ‘థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌’ చిత్రాలు విడుద‌ల రోజునే పైర‌సీ బారీన ప‌డ్డాయి. ఈ రెండు సినిమాల్నీ ముందే ఆన్‌లైన్‌లో పెట్టేసిన త‌మిళ రాకర్స్ అనే వెబ్‌సైట్ ఇప్పుడు `రోబో 2.ఓ`నీ పైర‌సీ చేస్తామంటూ సంకేతాలు పంపేసింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్‌ని వేదిక చేసుకుని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. `త్వ‌ర‌లోనే రోబో 2.ఓని విడుద‌ల చేస్తున్నాం` అంటూ త‌మిళ రాక్స్ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దాదాపు 600 కోట్ల‌తో రూపొందిన చిత్రం ‘రోబో 2.ఓ’. ఈనెల 29న విడుద‌ల అవుతోంది. ఈ సినిమా కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ర‌జ‌నీ అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో.. లీక్ చేస్తామంటూ వచ్చిన హెచ్చ‌రిక చిత్ర‌బృందాన్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఎలాగైనా స‌రే.. ఈ సినిమాని లీకేజీ వీరుల బారీన ప‌డ‌కుండా కాపాడాల‌ని చిత్ర‌బృందం శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తోంది. ఇందుకోసం ర‌జ‌నీ అభిమానుల స‌హాయాన్ని కోరుతోంది. ”ఇలా సినిమా విడుద‌ల‌కు ముందే లీక్ చేస్తామ‌ని బెదిరించం వ‌ల్ల‌.. చిత్ర‌సీమ ఎంత ఇబ్బందిలో ఉందో అర్థం అవుతోంది. కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో తీసిన సినిమాలు లీకేజీల బారీన ప‌డ‌డం శ్రేయ‌స్క‌రం కాదు. దీన్ని ప‌రిశ్ర‌మ అడ్డుకోవాలి” అంటూ.. త‌మిళ చ‌ల‌న చిత్ర ప్ర‌ముఖులు ఆందోళ‌న‌ వ్య‌క్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close