రేట్లు పెంచలేదు.. కమిషన్ పెంచాల్సి వచ్చింది..! సాక్షి బాధలు సాక్షివి..!!

తెలుగు దిన పత్రికలు ధరలు పెంచాయి. సాధారణ రోజుల్లో రూ. ఐదు నుంచి ఆరున్నరకు పెంచాయి. అంటే రూపాయిన్నర పెంచాయి. ఆదివారాల్లో రూ. ఆరు నుంచి.. రూ. ఎనిమిది చేశాయి. దానికి తగ్గట్లుగానే… ఏజెంట్లు, హాకర్లకు ఇస్తున్న కమిషన్లలో మార్పులు చేశాయి. కానీ… ఇక్కడ విశేషం ఏమిటంటే… వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి… కరపత్రిక.. సాక్షి మాత్రం ధరుల పెంచలేదు. ఇప్పటికే సర్క్యూలేషన్ తిరోగమనంలో ఉండటంతో… ధరుల పెంచితే.. మొదటికే మోసం వస్తుందన్న భయంతో… సాక్షి పత్రిక యాజమాన్యం రేటు పెంచడానికి సిద్ధం కాలేదని సమాచారం. ఈనాడు .. పద్దెనిమిది లక్షల వరకూ సర్క్యూలేషన్‌తో ఉండగా.. సాక్షి పత్రిక తొమ్మిది లక్షల దగ్గరే తచ్చాడుతోంది. ఈ పొజిషన్‌ను నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. రిపోర్టర్లు, స్ట్రింగర్లతో.. సర్క్యులేషన్ బాధ్యతలు మోయిస్తున్నారు. ఎన్ని చేసినా.. ఒక్క నెలకే.. అన్నీ రివర్స్ అవుతున్నాయి.

పైగా సాక్షి దినపత్రికను కోనుగోలు చేసేవారిలో అత్యధికులు.. పార్టీ సానుభూతి పరేలు. ప్రధానంగా ఏపీలో.. వైసీపీ శ్రేణులే… సానుభూతి పరులే సాక్షి పత్రికను కొనుగోలు చేస్తాయి. అసలైన న్యూస్ కోసం అయితే.. ఇతర పత్రికలను చూడాల్సిందే. అంతగా… వైసీపీకి.. జగన్ కు పత్రిక అంకితమయింది కాబట్టి.. ఇప్పుడు రేటు పెంచితే.. ఎందుకొచ్చిన బాధ అని ఆ క్యాడర్ అనుకునే ప్రమాదం ఉంది. అందుకే.. కష్టాలు, నష్టాలు భరించి.. వచ్చే ఎన్నికల వరకూ… రేట్లు పెంచకుండా నెట్టుకొస్తే.. ఆ తర్వాత పెట్టుబడులు వస్తాయనే.. అంచనాలో ఉన్నట్లు ఉన్నారు. అయితే… ఇలా రేటు పెంచకుండా ఉంటే సరిపోదని… కొత్తగా వారికి తెలిసొచ్చింది. ఏజెంట్లు, హాకర్‌లకు.. కమిషన్ పెంచాల్సి వచ్చింది.

ఇతర తెలుగు దినపత్రికలు.. రేట్లు పెంచాయి కాబట్టి.. కమిషన్ పెంచాయి. వాళ్లంతా కమిషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి… సాక్షి పేపర్‌ను… పక్కన పెట్టేసి.. ఆ పత్రికలు…వినియోగదారులకు అంటగట్టడం ప్రారంభించారు. ఒకటి, రెండో రోజుల్లోనే ఈ తేడా కనిపించడం.. కమిషన్ పెంపుపై… ఏజెంట్లు, హాకర్ల నుంచి ఒత్తిడి రావడంతో… ఇతర పత్రికలతో పాటుగా కమిషన్ పెంచాల్సి వచ్చింది. అంటే.. అదనపు ఆదాయం లేకపోగా.. కమిషన్ పెంచాల్సి వచ్చిందన్నమాట. నిజానికి ఈ పరిస్థితి.. గతంలో… సాక్షి పత్రిక.. ఇతర పేపర్లకు తెచ్చి పెట్టింది. వైఎస్ హయాంలో వచ్చి పడిన పెట్టుబడులతో.. పత్రికను.. మార్కెట్లోకి తీసుకొచ్చిన సాక్షి… రూ. 2కే పత్రికను మార్కెట్లోకి తెచ్చి…అందులోనూ… రూపాయిపైనే… ఏజెంట్లకు కమిషన్ ఇచ్చింది. ఈ కారణంగా.. అప్పట్లో మూడు రుపాయులు ఉన్న ఇతర పత్రికల యామాన్యాలు కమిషన్ పెంచక తప్పలేదు. ఇప్పుడు సాక్షిగా.. అదే ఎఫెక్ట్ రివర్స్‌తో తగిలింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ రూ. 14వేల కోట్లు మంగళవారం ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పడం లేదేంటి ?

తెలంగాణ ఎన్నికల సమయంలో రైతు బంధు రాజకీయం జరిగింది. ఎన్నికల సంఘం నిధులు జమ చేయడానికి అంగీకారం తెలిపింది. కానీ హరీష్ రావు దాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవడంతో మళ్లీ...

ఎలక్షనీరింగ్ : అంచనాల్ని అందుకోలేకపోయిన వైసీపీ

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ డబ్బుల పండగ చేస్తుందని ఓటర్లు ముఖ్యంగా వైసీపీకి చెందిన ఓటర్లు నమ్మకంతో ఉన్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ కు కూడా రూ....

మోడీ దృష్టిలో జగన్‌ విలువ అంతే !

మోడీకి దత్తపుత్రుడినని అందుకే తాను ఇలా ఉన్నానని జగన్ అనుకుంటూ.. సర్వ అరాచకాలకు పాల్పడ్డారు. కానీ మోడీ దృష్టిలో జగన్ కు గుర్తింపు ఆయన ఓ రాష్ట్ర సీఎం.. తాను...

కేసీఆర్ నాన్ సీరియస్ పాలిటిక్స్ !

పదవిలో ఉన్నప్పుడు.. తన వెనుక బలం, బలగం ఉన్నప్పుడు కేసీఆర్ చెప్పినవి చాలా మందికి బాగానే ఉన్నాయి. కానీ ఆయన సర్వం కోల్పోయాక.. పార్టీ ఉనికే ప్రమాదంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close