బాలకృష్ణ “సంభ్రమ ఆశ్చర్య” టంగ్ స్లిప్ పై విజయసాయి రెడ్డి సెటైర్

బాలకృష్ణ డైలాగులు చెప్పడంలో దిట్ట. స్క్రిప్ట్ ప్రకారం ఉన్న డైలాగులను ఎంత వీరోచితంగా చెబుతాడో, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడే సమయంలో అంత పేలవంగా ఉంటాయి బాలకృష్ణ స్పీచ్ లు. కొన్నిసార్లు ఒక పదానికి బదులు ఇంకొక పదం వాడడం వల్ల నెటిజన్లు బాలకృష్ణ ను విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇటీవల నందమూరి సుహాసిని కూకట్పల్లి నుంచి పోటి చేస్తున్న సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆ సమయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఒక పదానికి బదులు ఇంకొక పదం వాడుతూ టంగ్ స్లిప్ అయ్యారు. హరికృష్ణ అకాల మరణం తమని దిగ్భ్రాంతికి గురి చేసింది అనబోయి, తమని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది అని పొరపాటుగా అన్నారు. దీంతో నెటిజన్లు బాలకృష్ణ పై విరుచుకు పడ్డారు. అయితే ఇప్పుడు అదే నెటిజన్ల తరహాలో విజయసాయిరెడ్డి కూడా బాలకృష్ణ పై సెటైర్ వేశారు.

విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ, “మీ అన్న హరికృష్ణ గారు చనిపోవడం మీకు సంబరం తో కూడిన ఆశ్చర్యం కలిగించిందా? అవును, తండ్రికి వెన్నుపొడిచి కాటికి పంపిన వాడితో చేతులు కలిపిన చరిత్ర కదా. కుటుంబ సభ్యలు మరణిస్తే ఆనందం కలుగుతుందా? నిజమే మాట్లాడావా బాలయ్యా.” అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే బాలకృష్ణ ది ముమ్మాటికీ టంగ్ స్లిప్పే. దానిపై నెటిజన్లుు ఫైర్ అవడం కూడా సమంజసమే కానీ విజయసాయిరెడ్డి స్థాయి నాయకులు కూడా వీటిని రాజకీయం చేయాలనుకోవడం ఆశ్చర్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close