బాబు లేఖలు రాశారు.. రాకుండా అడ్డుకోండి..! ఖమ్మంలో కేసీఆర్ పిలుపు..!!

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీపై లేఖాస్త్రం సంధించారు. చంద్రబాబునాయుడు ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని… ఫిర్యాదు చేస్తూ.. కేంద్రానికి లేఖ రాశారని.. ఓ లేఖను ప్రదర్శించారు. సీతారామ ప్రాజెక్టుతో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని .. ఆ సీతారామ ప్రాజెక్టు వద్దంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారన్నారు. ప్రచారానికి వచ్చే చంద్రబాబును ఖమ్మం ప్రజలు నిలదీయాలన్నారు. ఏ ముఖం పెట్టుకుని ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థులు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాకు ప్రమాదం పొంచి ఉందని .. సీతారామ ప్రాజెక్టును వ్యతిరేకించేవారిని చిత్తుగా ఓడించాలన్నారు. అందులో ఏమున్నదో కానీ.. ఆ లేఖను.. వెనక్కి తీసుకున్న తర్వాత చంద్రబాబు ఖమ్మం జిల్లాకు రావాలనన్నారు. లేకపోతే.. ఖమ్మం జిల్లా ప్రజలు చంద్రబాబును ఎక్కడిక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇంత కాలం పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఖమ్మం జిల్లాను ఎండబెట్టాయన్నారు. విపక్షాల మాయమాటలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం జిల్లాలో 10 స్థానాలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 100 శాతం మ్యానిఫెస్టోను అమలు చేసిన ఘనత టీఆర్ఎస్‌దేనని కేసీఆర్ ప్రకటించారు. నిర్మాణంలో 2లక్షల 70వేల డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఉన్నాయన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు..కాంగ్రెస్‌, టీడీపీ కట్టిన 7ఇళ్లతో సమానమని.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. 6నెలలు ఆలస్యమైనా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పక్కనే గోదావరి ఉన్నా ఖమ్మం జిల్లాలో కరువు తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ నేతలు ఖమ్మం జిల్లాకు ఎందుకు సాగునీరు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఆంధ్రాకు నీళ్లు తీసుకెళ్లేందుకే దుమ్ముగూడెం, సాగర్‌ టెయిల్‌పాండ్‌లు తెచ్చారని విమర్శించారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పనికిరావని ..మోదీకి అధికారం ఇస్తే పనిచేయలేక చతికలపడ్డారని విమర్శించారు. కేంద్రంలో చక్రం తిప్పుతా.. తోక తిప్పుతా అని చెప్పనని సెటైర్ వేసారు.

వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో క్రీయాశీలకంగా మారుతామన్నారు. టీడీపీ అభ్యర్థి నామాను గెలిపిస్తే ప్రజలకు నామాలు పెడతారని హెచ్చరించారు. కేసీఆర్ గతంలో సభల్లో ప్రసంగించినట్లుగా.. చంద్రబాబుపై పరుషమైన వ్యాఖ్యలు చేయలేదు. కానీ.. కుల, మతాలు మనకు అన్నం పెట్టవని ప్రజలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ప్రచారంలో… తాము ఖమ్మం జిల్లాను క్లీన్ స్వీప్ చేస్తామన్న శబ్దాలు వచ్చాయి.. కానీ అంత కాన్ఫిడెన్స్ మాత్రం కనిపించలేదు. చంద్రబాబునే టార్గెట్ చేసుకున్నారు. టీఆర్ఎస్ గెలవకపోతే.. ఖమ్మం జిల్లాకు ఏదో జరిగిపోతుందన్న భావన ప్రజలకు కల్పించడానికి ప్రయత్నించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close