అంబర్ పేట రివ్యూ : కిషన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉందా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. 2009లో భారతీయ జనతా పార్టీ పరువు నిలిపిన అసెంబ్లీ నియోజకవర్గం అంబర్ పేట. ఆ ఒక్క స్థానం నుంచే కిషన్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా.. అందరి దృష్టి అదే నియోజకవర్గంపై ఉంది. గత ఎన్నికల్లోనే కిషన్ రెడ్డి.. అంబర్ పేట నుచి తప్పుకుని.. సికింద్రాబాద్ పార్లమెంట్ కు పోటీ చేయాలనుకున్నారు. కానీ దత్తాత్రేయకు హైకమాండ్ సీటు ఇచ్చింది. ఈ సారి కూడా.. జమిలీ ఎన్నికలు వస్తే.. అంబర్ పేటను భార్యకు ఇచ్చి.. తాను సికింద్రబాద్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ ముందస్తు రావడంతో బరిలోకి దిగక తప్పలేదు. గత రెండు ఎన్నికల్లో అంబర్ పేట నుంచి తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. అంతకుముందు ఆయన హిమాయత్ నగర్ నుంచి కూడా ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మూడుసార్లు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కిషన్ రెడ్డి ఈ స్థానాన్ని కంచుకోటగా మార్చుకున్నారు. అందుబాటులో ఉంటారనే పేరు, ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. కానీ ఇదేదీ.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని కాపాడలేదు. అన్ని డివిజన్లలోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ బలంతోనే ఈ సారి.. ప్రత్యేకమైన వ్యూహాన్ని టీఆర్ఎస్ అధినేత రెడీ చేశారు. మాజీ కార్పొరేటర్, అడ్వకేట్ కాలేరు వెంకటేష్ ను కిషన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించారు. ప్రస్తుతం కాలేరు వెంకటేష్ భార్య కార్పొరేటర్ గా ఉన్నారు. 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డిపై సహజంగానే ఏర్పడే వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇక నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న ముస్లిం ఓట్లు కూడా తమకు కలిసివస్తుందని నమ్మకంగా ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి బరిలో దిగగా 17 వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ టీఆర్ఎస్ కే మద్దతు ఇస్తోంది.

కిషన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయడంలో.. నిర్లక్ష్యం చేసింది. టీజేఎస్ కు కేటాయింస్తారని ప్రచారం జరిగింది . అయినా చివరి నిమిషంలో తీవ్ర హైడ్రామా మధ్య కాంగ్రెస్ కూడా అంబర్ పేటలో పోటీకి దిగింది. కానీ కాంగ్రెస్ కానీ.. టీజేఎస్ అయినా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు . అంబర్ పేటలో పోటీ.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉండనుందని చెప్పుకోవచ్చు. కాలేరు వెంకటేష్ ను టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత.. జి.కిషన్‌రెడ్డికి సొంత పార్టీ కార్యకర్తలే షాక్‌ ఇచ్చారు. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత గోల్నాక, అంబర్‌పేట, నల్లకుంట డివిజన్లకు చెందిన నేతలు బీజేపీకి రాజీనామా చేశారు. అంబర్‌పేట డివిజన్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.ఆనంద్‌గౌడ్‌ పార్టీకి రాజీనామా చేసి కిషన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నల్లకుంట డివిజన్‌ రత్నానగర్‌కు చెందిన బీజేపీ సీనియర్‌నాయకుడు ప్రశాంత్‌ ముదిరాజ్‌, పార్టీకి రాజీనామా చేశారు. ఆనంద్‌గౌడ్‌ ను బుజ్జగించడానికి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సైతం రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ అసంతృప్తులు, ఆయనపై వ్యతిరేకత .. పుట్టిముంచితే.. ఆశ్చర్యం లేదన్న అంశం.. అంబర్ పేటలో చక్కర్లు కొడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close