బై జీన్స్ టీడీపీ… బై చాన్స్ టీఆర్ఎస్..! ఆ అభ్యర్థుల పరిస్థితి ఏమిటి..?

2014 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పదిహేను అసెంబ్లీ నియోజవకర్గాల్లో విజయం సాధించింది. వీరిలో పన్నెండు మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఒకరు కాంగ్రెస్‌లో చేరారు. కృష్ణయ్య అసెంబ్లీ రద్దయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంటే.. పదిహేను మందిలో నికరంగా.. ఒక్క సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాత్రమే మిగిలారు. గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. టీఆర్ఎస్‌లో వీరి పరిస్థితి ఎలా ఉంది..? వారిని టీఆర్ఎస్ నేతలుగా చూస్తున్నారా..?. వారికి పార్టీ తరపున సహకారం అందుతోందా..? అంటే.. లేదనే చెప్పాలి. అందరూ.. టీఆర్ఎస్‌లో ద్వితీయశ్రేణి నేతలుగా మిగిలిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీడీపీ తరపున గత ఎన్నికల్లో గెలిచి.. ఈ సారి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వారు.. సంప్రదాయ టీఆర్ఎస్ క్యాడర్ నుంచి.. వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. శేరిలింగం పల్లిలో.. కార్పొరేట్లు ఎవరూ అరికెపూడి గాంధీకి సహకరించడం లేదు. ఆయన వెంట టీడీపీ క్యాడర్ కూడా పెద్దగా లేదు. ఇక కూకట్ పల్లిలో.. మాధవరం కృష్ణారావును వ్యతిరేకిస్తూ.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన… గొట్టిముక్కల పద్మారావు ఏకంగా పార్టీకి రాజీనామా చేసేశారు. గత ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఇక జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో.. కేటీఆర్ సన్నిహితుడైన సతీష్ రెడ్డి రేపిన అలజడిలో… మాగంటి గోపీనాథ్‌నే.. కేటీఆర్ మందలించారు. సతీష్ రెడ్డి.. గతంలో జూబ్లిహిల్స్ ఇన్చార్జ్ గా ఉండేవారు. ఓ సెటిల్మెంట్ కేసులో ఒడిషా జైలుకు వెళ్లారని.. ఆ కేసుతో కేటీఆర్‌కు సంబంధం ఉందన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు పార్టీలో పోటీ విషయానికి వచ్చే సరికి.. మాగంటి గోపీనాథ్‌కు.. కేటీఆర్ చివాట్లు తప్పలేదు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో… ప్రకాష్ గౌడ్‌ను టీఆర్ఎస్‌ జమ్మీని చేసిందనేప్రచారం జరుగుతోంది.

అక్కడ టీఆర్ఎస్ తరపున ఓ బలమైన రెబల్ క్యాండిడేట్ ఉన్నారు. ఆయనకు టీఆర్ఎస్ క్యాడర్ సహకరిస్తోంది. ప్రకాష్ గౌడ్ మాత్రం.. తన సొంత అనుచరవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ మజ్లిస్ కోసమే.. టీఆర్ఎస్ రెబల్‌ను బరిలోకి నిలబెట్టిందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎక్కడా మజ్లిస్ పోటీ చేయడం లేదు.. ఎనిమిది స్థానాల్లో తప్ప. దీంతో ప్రకాష్ గౌడ్ భవితవ్యం… చిక్కులో పడిపోయింది. గ్రేటర్ పరిధిలోనే కాదు.. పాలకుర్తి, పరకాల నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డిలకూ.. టీఆర్ఎస్ పాత క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఏ విధంగా చూసినా.. టీడీపీ నుంచి గెలిచి.. టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన వారిలో లక్ బై చాన్స్ ఒకరిద్దరు బయటపడతారేమో కానీ.. మిగతా వాళ్లను.. టీఆర్ఎస్ నేతలే ఓడిస్తారని ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close