పోలింగ్ శాతం పెరిగితే టీఆర్ఎస్‌ ఓటమికి ఎలా కారణం అవుతుంది..?

తెలంగాణ ఎన్నికల ఫలితం… ప్రజలు వినియోగించుకునే ఓట్ల శాతం పై ఆధారపడి ఉంటుందని లగడపాటి రాజగోపాల్ చెబుతున్నారు. గత ఎన్నికల్లో 68.5 శాతం పోలింగ్ నమోదయింది. ఈ పర్సంటేజీ కన్నా పోలింగ్ పెరిగితే.. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. ప్రత్యామ్నాయం కోసం.. ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారన్నది రాజకీయవర్గాల విశ్లేషణ. దానికి తగ్గట్లుగానే.. లగడపాటి… పోలింగ్ శాతం పెరిగితే.. అధికార పార్టీకి నష్టం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని ప్రకిటంచారు.

గత ఎన్నికల్లోలా 68.5 శాతం ఓటింగ్ జరిగితే.. ప్రజాకూటమికే.. స్వల్ప అధిక్యత ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. నాలుగు జిల్లాల్లో కూటమి, మూడు జిల్లాల్లో టీఆర్ఎస్, రెండు జిల్లాల్లో హోరాహోరీగా ఉంటుందని చెబుతున్నారు. అదే సమయంలో పోలింగ్ శాతం తగ్గితే మాత్రం హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంటే… ఏ విధంగా చూసినా…పోలింగ్ పర్సంటేజీ.. గత ఎన్నికల్లాగనే ఉన్నా.. కొంచెం పెరిగినా.. ప్రజాకూటమికే.. అనుకూలం అని లగడపాటి తన అధ్యయనంలోతేలిందంటున్నారు. ఎంత ఎక్కువ ఓటింగ్ శాతం పెరిగితే.. ప్రజాకూటమికి అంత ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉందంటున్నారు.

అదే పోలింగ్ శాతం తగ్గితే.. అధికార పార్టీకి అనుకూలం కాదు. కానీ… హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. బీజేపీ, ఎంఐఎం గణనీయమైన సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఓ రకంగా.. టీఆర్ఎస్ కి రెండు దారులు మూసుకుపోయినట్లేనని చెప్పుకోవచ్చు. పోలింగ్ శాతం బాగా తక్కువ నమోదయి.. హంగ్ వస్తే.. మాత్రం.. బీజేపీతోనో.. ఎంఐఎంతోనే కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏ విధంగా చూసినా.. ఈ సారి పోలింగ్ పర్సంటేజీనే.. అసలు ఫలితాలను నిర్దేశించబోతున్నది. ప్రజాకూటమి ఎంత ఎక్కువ మందిని.. ఓటింగ్ కేంద్రాల వైపు ఆకర్షించగలుగుతుందో… అంతగా అధికారంలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close