రేపు సీఎంగా కేసీఆర్ ప్రమాణం..! వందశాతం ఏపీకి వెళ్తానని ప్రకటన..!!

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ .. గురువారం మధ్యాహ్నం రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ను తమ లీడర్ గా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కేసీఆర్ తో ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్… వంద శాతం ఏపీకి వెళ్తానని మరోసారి ప్రకటించారు. అక్కడి నుంచి తనకు ఆహ్వానాలు వస్తున్నాయంటున్నారు. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంత్రివర్గంలో 18 మందికే అవకాశం ఉంది..పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా విషయంలో ఏపీకి మద్దతిచ్చే అంశంపై చెప్పకుండా.. ప్రత్యేకహోదావస్తే ఏముందని చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని.. ఇప్పుడు ఆయనే ప్రత్యేకహోదా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదన్నారు.

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ మరోసారి తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేంద్రం తాను చేయాల్సిన పనిచేయకుండా అధికారాలు పెట్టుకొని..రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని విమర్శించారు. ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు, పార్టీల్లో ఉందన్నారు. రూరల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వైద్యం, విద్య.. కేంద్రం దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మోదీ ఫెడరలిజం అని చెబుతున్నా ఎక్కడా ఆచరించడం లేదని.. బీజేపీ, కాంగ్రెస్‌ తేడా లేదు.. దొందూ దొందేని కేసీఆర్ తేల్చి చెప్పారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం అవసరమన్నారు. కొత్త వ్యవసాయం విధానం అవసరం..మూస వ్యవసాయ విధానం పోవాలన్నారు. రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఎంత పెట్టుబడి అవుతుందో ఐడియా ఉందని.. సుమారు 3 నుంచి 4 లక్షల కోట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. ఇంత పెద్ద దేశంలో మైనార్టీల బడ్జెట్‌ 4 వేల కోట్లా? అని కేసీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ చెప్పుకునేది జాతీయ పార్టీ..రాష్ట్రానికో పాలసీ ఉంటుందని విమర్శించారు. ఉద్యోగులకు సీపీసీ విధానం తెచ్చిందే కాంగ్రెస్‌ అని మండిపడ్డారు. కేసీఆర్ ఏ హామీలు అమలు చేయలేదన్న రాహుల్ విమర్శపై కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాము చెప్పని కార్యక్రమాలు కూడా చేశామన్నారు. ఉద్యోగుల భర్తీపైనా తనను తాను డిఫెండ్ చేసుకున్నారు. నిరుద్యోగులను మోసం చేసే పార్టీలు చాలా ఉన్నాయన్నారు. మాకన్నా ముందు కాంగ్రెస్‌, టీడీపీ 60 ఏళ్లు పాలించాయని.. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాయని ప్రశ్నించారు. యువతకు పచ్చి అబద్దాలు చెప్పి కన్ఫ్యూజ్ చేశారని ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నా వంద శాతం భర్తీ చేస్తామని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

రేవంత్ సర్కార్ కు టైం ఫిక్స్ చేసిన బీజేపీ..!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా..? కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం పీఠం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందా..?అంటే వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close