చెక్కు ఫోర్జరీ చేసి కోటిన్నర స్వాహా..! చేసింది సాక్షి ప్రముఖ జర్నలిస్ట్..!!

హైటెక్ మోసాల గురించి జర్నలిస్టులు కథలు కథలుగా రాస్తూంటారు. కానీ జర్నలిస్టులే చేసిన మోసాలను అలా రాయడం అరుదు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఓ ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. సాక్షి దినపత్రిక జర్నలిస్టులు.. ఓ స్వచ్చంద సంస్థ చెక్కులను ఫోర్జరీ చేసి.. కోటిన్నర నొక్కేసిన వెలుగు చూసింది. సంచలనం రేపుతోంది. వైజాగ్ కు చెందిన ఓ స్వచ్చంద సంస్థకు చెందిన కార్యాలయంతో ఏ సందర్భంలో పరిచయం అయిందో కానీ…విశాఖ సాక్షి ప్రతిని.. చెక్కులు తెచ్చుకున్నారు. వాటిని ఫోర్జరీ చేసి.. వరుగా డబ్బులు డ్రా చేసుకున్నారు. సంస్థకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టు బయటపడింది. విశాఖ పోలీసులు సాక్షి జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపు లోనికి తీసుకున్న వారిలో మంగళగిరి సాక్షి కార్యాలయం లో పనిచేసే సబ్ ఎడిటర్ యడ్లురి ఆనంద్, తుళ్లూరు సాక్షి విలేకరి మేడా.తులసిరామ్, విశాలాంధ్ర విలేకరి గోచిపాతల.సిరివర్ధన్, బాలరాజు ఉన్నారు.

వైజాగ్ సాక్షి ప్రతినిధి నేతృత్వం లో మంగళగిరి మండలం పెడవడ్లపూడి కార్యాలయం లోని సబ్ ఎడిటర్, తుళ్లూరు సాక్షి విలేకరి అధ్వర్యం లో నడిచిన లావాదేవీలు…నడిచాయి. చెక్ ఫోర్జరీ చేసి.. నిందితులు దాదాపు రూ.1కోటి 40 లక్షలు వరకు వివిధ ఖాతాలలోనికి బదిలీ చేసారు. మీడియాలో పని చేసిన అనుభవంతో.. ఒకే ఖాతాకు.. అదీ తమ ఖాతాలకు నగదు బదిలీ చేసుకుంటే సమస్య అవుతుంది.. ఇతరులకు రూ. ఆరు వేల కమిషన్ ఇచ్చి..వాటిల్లో జమ చేయించారు. కింది స్థాయి ఉద్యోగులు, సహచర ఉద్యోగుల ఖాతాలలోనికి నిధులు మళ్లించారు. దాదాపు 26 ఖాతాలకు మూడు రోజులలో ఒక కోటి నలభై లక్షల వరకు బదిలీ అయ్యాయి. బాధిత సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు తో వైజాగ్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు. అమరావతి లో రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశారు. బుధవారం మధ్యాహ్నం నిందితులను అదుపులోకి తీసుకున్నారు వెంటనే వైజాగ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నగదు బదిలీ అయిన 26 మంది ఖాతా దారులను తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపారు. ఈ చెక్కు మోసం వ్యవహారం మీడియా వర్గాలలో కలకలం రేపింది. మొదటగా… సాక్షి ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారం కావడం. వేలల్లో జీతాలు తీసుకనేవారికి రోజుల్లోనే కోట్లలో లావాదేవీలు జరపడంతో.. ఇదేదో ఎన్నికల మిస్టరీ అనుకున్నారు. కానీ చివరికి పక్కా మోసం అని తేలడంతో..మీడియా వర్గాలు ముక్కున వేలేసుకున్నాయి.. కాకతాళీయంగా.. ఈ తరహా మోసానికి పాల్పడింది సాక్షి ఉద్యోగి కావడంతో..ఈ ఘనటకు మరింత ప్రాదాన్యం ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌గ‌న్ బ్యాండేజీ.. మ‌ళ్లీ ట్రోల్స్ షురూ!

అదేదో యాడ్‌లో చెప్పిన‌ట్టు.. 'ఏపీలో ఏం న‌డుస్తోంది' అంటే 'బ్యాండేజీల ట్రెండ్ న‌డుస్తోంది' అంటారు అక్క‌డి జ‌నం. ప్ర‌చార స‌భ‌లో జ‌గ‌న్‌పైకి ఎవ‌రో ఓ అగంత‌కుడు గుల‌క‌రాయి విసిరిన ద‌గ్గ‌ర్నుంచీ ఈ బ్యాండేజీ...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

ఐపీఎల్ ఎఫెక్ట్: బౌల‌ర్లే బ‌లి ప‌శువులు అవుతున్నారా?!

262 ప‌రుగుల ల‌క్ష్యం.. ఒక‌ప్పుడు వ‌న్డేల్లో ఈ టార్గెట్ రీచ్ అవ్వ‌డానికి ఛేజింగ్ టీమ్ ఆప‌సోపాలు ప‌డేది. ఇప్పుడు టీ 20ల్లోనే ఊదిప‌డేశారు. శుక్ర‌వారం కొల‌కొత్తా నైట్ రైడ‌ర్స్‌ - కింగ్స్ లెవెన్ పంజాబ్...

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close