సాక్షిలో సెంటిమెంట్ కథలు..! పిండేస్తున్నారంతే..!!

సాక్షి పత్రికలో చేయి తిరిగిన సెంటిమెంట్ రచయితలకు కొదువ లేదు. జగన్ పాదయాత్ర పులివెందులలో ప్రారంభించిన తర్వాత వారి తమ తమ పెన్ పవర్ చూపించారు. జగన్‌ను చూసే వరకూ… అన్నం తినేది లేదన్న మూడేళ్ల పాప ప్రతిజ్ఞ దగ్గర్నుంచి.. ఆరేళ్ల బాబుకు జగన్ పేరు పెట్టడం వరకూ.. రకరకాలుగా… విభిన్న వ్యాకరణంతో.. జగన్ పై ప్రజలకు అభిమానాన్ని సెంటిమెంట్‌ రూపంలో పాఠకుల ముందు ఉంచేందుకు నానా విన్యాసాలు చేశారు. మధ్యలో ఓవర్ అయిపోయిందేమోనని కొద్దిగా ఇలాంటి స్టోరీల్లో “సెంటిమెంట్ గాఢత”కు విరామం ఇచ్చారు కానీ.. ఇప్పుడు.. పాదయాత్ర ముగింపునకు వచ్చింది కాబట్టి.. కొత్తగా… కథనాలు ప్రారంభించారు. అందులో భాగంగా.. ఓ తొమ్మిదో తరగతి పాప గురించి … రాసింది చదివితే ” పిండేశారంతే..” అని మనసు దిటవు చేసుకోవాల్సిందే.

జగన్ ను చూడాలంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదట.. కానీ ఆ పాప.. రెండు కిలోమీటర్లు పరుగులు పెట్టుకుంటూ వచ్చిందట. ఆ బాధ తట్టుకోలేక ఏడుస్తూంటే.. జగన్ ఓదార్పు ఇచ్చారట. అదీ సాక్షి మ్యాటర్. కానీ అసలు విషయం వేరే ఉంది. మామూలుగా అయితే ఇప్పుడు జగన్ దగ్గరకు వేరే వారిని పోనివ్వడం లేదు. ముందుగా… పోలీసులు తనిఖీలు చేసి. ఆ తర్వాతే ఎవరినైనా పంపిస్తున్నారు. పెద్దలు లేకుండా చిన్న పిల్లల్ని అసలు రానివ్వరు. ఆ పాప గ్రామంలోని వైసీపీ నాయకులు జన సమీకరణలో.. తీసుకొచ్చారు. పనిలో పనిగా లైన్‌లో నిలబెట్టారు. మధ్యాహ్నం తీసుకొస్తే.. సాయంత్రం వరకూ నిలబెట్టారు. స్కూల్‌కి కూడా డుమ్మా కొట్టాల్సి వచ్చింది. ఈ బాధలన్నీ… జగన్ వల్లేనని ఆయన్ని చూడగానే ఏడ్చేసినట్లు ఉంది ఆ పాప. దానికే.. జగన్ .. సెంటిమెంట్ కలర్ ఇచ్చేశారు. సాక్షిలో ఓ కథ రాసేసుకున్నారు.

జగన్ పాదయాత్ర కవరేజీలో ఏం రాయాలో తెలియక.. ఆయన పాత్రికేయ సిబ్బంది నానా తంటాలు పడుతున్న విషయం… ఆ పేజీ లు చూస్తున్న వారికి సులువుగానే అర్థమైపోతుంది. టిప్‌టాప్‌గా తయారై వచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు కూడా.. స్క్రిప్ట్ ప్రకారం తాము అత్యంత కడు పేదరికంలో ఉన్నామని చెబితే ఫోటోలతో సహా వేసేసి.. తమ టాలెంట్‌ని చూపిచాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు. పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. మరో రెండు, మూడు శుక్రవారాలు దాటితే… పాదయాత్ర ముగిసిపోయే అవకాశం ఉంది. అందుకే.. ఇప్పుడు సెంటిమెంట్‌ను మరింత దట్టిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా.. ఈ సెంటిమెంట్ ప్రదర్శన చూసి.. పడి పడి నవ్వుకోవాల్సి వస్తోంది. … బాబూ.. చిట్టీ.. ! సెంటిమెంట్ కామెడీ అయిపోతోందమ్మా..!?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close