వెంకీని వెన‌క్కి తీసుకెళ్లా: అనిల్ రావిపూడి

వెంక‌టేష్ అంటేనే వినోదం. ఆయ‌న కామెడీ టైమింగ్ భ‌లే బాగుంటుంది. మ‌ల్లీశ్వ‌రి, నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాల్ని ఎన్నిసార్లు చూసినా చూడ‌బుద్దేస్తుందంటే దానికి కార‌ణం.. వెంకీ కామెడీ టైమింగే. దాన్ని ఈమ‌ధ్య ఎవ్వ‌రూ స‌రిగా వాడుకోలేడం లేదు. అనిల్ రావిపూడి మాత్రం `నేను వాడేశా` అంటున్నాడు. త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘ఎఫ్ 2’ ఈ సంక్రాంతికి విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్‌తేజ్ మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టించాడు. ‘ఎఫ్ 2’ ప్రీ రిలీజ్ వేడుక విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వెంకీ పాత్ర గురించి అనిల్ రావిపూడి క్లూ ఇచ్చాడు.

”వెంక‌టేష్ గారి కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయ‌న మేన‌రిజ‌మ్స్ బాగుంటాయి. ఆయ‌న ఇవ్వ‌ని ఎక్స్‌ప్రెష‌న్ లేదు. కామెడీ టైమింగ్ పిండుకున్న‌వాళ్ల‌కు పిండుకున్నంత‌. ఈ సినిమా కోసం వెంక‌టేష్ గారిని టైమ్ మిష‌న్ ఎక్కించి వెన‌క్కి తీసుకెళ్లాం. మ‌ల్లీశ్వ‌రి, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వు నాకు న‌చ్చావ్ రోజుల్లోకి తీసుకెళ్లాం. ఆయ‌న వ‌రుణ్‌తో క‌ల‌సి పండించే వినోద‌మే ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లం. వ‌రుణ్ కూడా కామెడీ చాలా బాగా చేశాడు. ఈ సంక్రాంతి మిమ్మ‌ల్ని న‌వ్వించి తీర‌తాం” అని ధీమాగా చెబుతున్నాడు అనిల్ రావిపూడి. జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close