శివసేన, ఏజీపీ, అప్నాదళ్.. ! ఎన్డీఏకు లేనట్లే ..?

కొత్త మిత్రులను వెదుక్కని అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటున్న… బీజేపీ పెద్దలకు.. మిత్రపక్షాలను సముదాయించడం వల్ల కావడం లేదు. ఇప్పటికే… మిత్రపక్షాలన్నీ దూరయి.. దాదాపుగా ఒంటరిగా మిగిలిన ఎన్డీఏకు… మూడు రాష్ట్రాల్లో కీలక పార్టీలు.. హ్యాండిచ్చేందుకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్రలో శివసేన ఇప్పటికే కలు దువ్వింది. యూపీలో అప్నాదళ్… ఆత్మగౌరవ నినాదం అందుకుంది. అసోంలో అసోం గణపరిషత్.. నమస్కారం పెట్టేసింది. ఈ మూడింటిలో మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. శివసేన తోడ్పాటు లేకపోతే… మహారాష్ట్రలో ఈ సారి దారుణ పరాభవం ఎదురవుతుందన్న భావన ఉంది. హిందూత్వ ఎజెండాలో శివసేన దూకుడుగా ఉంది. బీజేపీపై విమర్శలు ఉన్నాయి. దీంతో… ఒకే భావజాలం ఉన్న పార్టీలు రెండు వేర్వేరుగా పోటీ చేస్తే.. ఎక్కువగా హిందూత్వ నినాదం వినిపిస్తే.. శివసేనకు అడ్వాంటే అవడం ఖాయంగా కనిపిస్తోంది.

శివసేన చాలా రోజుల నుంచి నరేంద్రమోడీని, అమిత్ షాను మాటలతో అత్యంత దారుణంగా అవమానిస్తోంది. రాహుల్ గాంధీని పొగుడుతోంది. కానీ పొత్తు లేకపోతే.. వచ్చే తిప్పలు తెలుసు కాబట్టి.. వారిద్దరూ నోరు మెదపడం లేదు. ఎంత చేసినా.. ఇప్పుడు సీట్ల సర్దుబాటుకు .. శివసేన అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ తమతో పొత్తు పెట్టుకోవాలంటే.. బీజేపీ మైనర్ పార్టనర్ కావాల్సిందేనని… శివసేన అంతర్గతంగా జరిగిన చర్చల్లో తేల్చి చెప్పేసింది. అరవై శాతానికిపైగా సీట్లను డిమాండ్ చేస్తోంది. అలా అరవై శాతం సీట్లు శివసేనకు వదిలేయడానికి బీజేపీ సిద్ధపడటం లేదు. అలా చేస్తే.. పార్టీని శివసేనకు అప్పగించినట్లవుతుందని అనుకుంటోంది. అందుకే ఒంటరి పోటీ ఎలా అని ఆలోచన ప్రారంంభించింది.

అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మిత్రపక్షం… అప్నాదళ్.. బీజేపీ అవమానిస్తోందని మండి పడుతోంది. కొన్నాళ్ల క్రితం.. అప్నాదళ్ ను కూటమిలో చేర్చుకుని ఆ పార్టీకి చెందిన అనుప్రియాపటేల్‌కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు నరేంద్రమోదీ. అయితే.. ఇప్పుడు యూపీలో పరిస్థితులు మారిపోయాయి. ఎస్పీ, బీఎస్పీ కలిస్తే… ఇతర పార్టీలకు సీట్లు వస్తాయో రావో అన్న పరిస్థితి ఏర్పడింది. అందుకే.. అప్నాదళ్ అగ్రనేతలు.. బీజేపీ తమను అవమానిస్తోందంటూ బయటపడుతున్నారు. నేడో రేపో గుడ్ బై చెప్పినా ఆశ్చర్యం లేదంటున్నారు. అలాగే అసోంలో పౌరసత్వ బిల్లు విషయం అసోం గణపరిషత్ బీజేపీపై తీవ్ర నిరసన వ్యక్తం చేసి కూటమి నుంచి వైదొలిగింది. ఇతర పొరుగు దేశాల నుంచివ వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. దీన్ని ఖండిస్తూ.. ఏజీపీ బయటకు వచ్చేసింది. ఆ పార్టీ వెళ్లిపోవడం వల్ల.. అసోంలో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పు లేదు కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ప్రభావం చూపించడం ఖాయమే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close