ఈ నెల నుంచే ఏపీలో రూ. 2 వేల పెన్షన్..! ఓట్ల వేట ప్రారంభించిన ఏపీ సీఎం..!

ఎన్నికల కోడ్ రాక ముందే.. సంక్షేమ లబ్దిదారులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించి.. రాజకీయలబ్ది పొందే ప్రయత్నంలో.. చంద్రబాబునాయుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రూ. 2 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. ఈ నెల నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారని.. ప్రకటించారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 54లక్షల మంది పించన్ దారులకు లబ్దిదారులు ఉన్నారు. వీరందరికీ.. సామాజిక భద్రతా పెన్షన్ రెట్టింపు అవుతుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు…చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది కలగనుంది.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కాక ముందు.. రూ. రెండు వందలు మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మొత్తాన్ని వెయ్యి రూపాయలు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను అధికారంలోకి వస్తే.. పెన్షన్ రూ. 2వేలు ఇస్తానంటూ.. హామీ ఇచ్చి ప్రచారం చేశారు. దానికి కౌంటర్ గా.. చంద్రబాబు నాయుడు.. పెన్షన్లను పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. ఈ నెల నుంచే అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. పెంచిన పెన్షన్ మొత్తం లబ్దిదారులకు ఒక సారి అందితే.. నమ్మకం కలుగుతుందని.. అది ఓట్లుగా మారుతుందని.. చంద్రబాబు అంచనా. ఫిబ్రవరిలో.. ఎన్నికల షెడ్యూల్ రావడం ఖాయమయింది. ఫిబ్రవరిలో ప్రకటిస్తే.. తొలిసారి పెరిగిన మొత్తం పెన్షన్ ఓటర్లకు పంపిణీ చేయడం ఇబ్బందికరం కావొచ్చు. ఎవరైనా కోర్టుకు వెళ్తే ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఒక నెల ముందుగానే చంద్రబాబు పెన్షన్ పెంచడమే కాదు.. పెంచిన మొత్తం పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఎన్నికల్లో.. సంక్షేమ పథకాలు.. వాటి లబ్దిదారులే కీలకంగా మారుతున్నారు. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారు కృతజ్ఞతగా ఓటు వేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఇదే జరిగిందని… తెలుగుదేశం పార్టీ నేతలు నమ్ముతున్నారు. అందుకే.. జన్మభూమిలో పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెడుతున్నారు. ఇళ్ల ధరఖాస్తు దారులకు మంజూరు పత్రాలు ఇస్తున్నారు. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. మొత్తానికి.. సంక్షేమం విషయంలో ఏపీ ప్రభుత్వం భారీ ఖర్చుకు వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close