సుప్రీంకోర్టుకు ఏమయింది..?

సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తులను నియమించారు. మామూలుగా అయితే ఇది సాధారణ ప్రక్రియే. కానీ క్రిస్మస్ ముందు జరిగిన సమావేశంలో.. సీనియార్టీని బట్టి… ఇద్దరు న్యాయమూర్తుల పేర్లను కొలిజియం రెడీ చేసింది. అయితే… క్రిస్మస్ అయిపోగానే.. కేంద్రానికి వెళ్లిన జాబితాలో ఆ రెండు పేర్లు లేవు. సీనియార్టీలో… 32 మందిని కాదని…. ఆ తర్వాత ఇద్దరు పేర్లతో కొలిజీయం సిఫార్సు చేస్తూ.. కేంద్రానికి పంపింది. కేంద్రం ఆ రెండు పేర్లనూ ఆమోదించింది. సీనియార్టీలో ఉన్న ఆ ఇద్దరి పేర్లను ఖరారు చేసి… మళ్లీ ఎందుకు తప్పించారు..? జూనియర్లుగా ఉన్న వారికి ఎందుకు అవకాశం కల్పించారు..? అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

క్రిస్మస్ కు ముందు.. కొలిజియం మీటింగ్‌లో … ఢిల్లీ, రాజస్థాన్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రాజేంద్ర మీనన్, జస్టిస్ ప్రదీప్ నంద్రజోగ్ లకు.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలిజీయం నిర్ణయించింది. అయితే ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినేష్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సంజీవ్ ఖన్నాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా .. కొలిజియం పేరుతో చీఫ్ జస్టిస్ గొగోయ్ సిఫార్సు చేశారు. కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసేసింది. దీనిపై న్యాయనిపుణుల్లో కలకలం ప్రారంభమయింది. గతంలో.. ఏ కారణంతో.. చరిత్రలో జరగని విధంగా.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టారో.. అవే ఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. అసలు విశేషం.. ఏవి అయితే జరగుతున్నాయని.. ఆరోపిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన రంజన్ గొగోయ్ ఇప్పుడు… సీజేగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని కొలిజియమే.. ఈ నిర్ణయాలు తీసుకుంటంది. అంటే.. తాము వ్యతిరేకించి.. ప్రెస్ మీట్ పెట్టి.. ఇప్పుడు అవే సీజే చేస్తున్నారు.

పలువురు న్యాయమూర్తులు… కొలిజియం నిర్ణయంపై అసంతృప్తితో ఉన్నారు. చీఫ్ జస్టిస్ కు .. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కౌల్ నేరుగా లేఖాస్త్రం సంధించారు. అదే సమయంలో బార్ కౌన్సిల్ కూడా… జూనియర్లను… సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తానికి సుప్రీంకోర్టుపై… వివాదాలు.. న్యాయవ్యవస్థను ఉంకూడదని పద్దతుల్లో వార్తల్లో ఉంచుతున్నాయి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

నిరాసక్తంగా జగన్ ప్రచారం – ఆశలు వదిలేసుకున్నట్లే !

ఏపీ సీఎం జగన్ ప్రచారానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రెండు, మూడు రోజులకో సారి తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమవుతున్నారు. ప్రచార సభల్ని పరిమితం చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్...

ఒంగోలు లోక్‌సభ రివ్యూ : డబ్బుతొ గెలిచేస్తానని చెవిరెడ్డి లెక్కలు

ఒంగోలు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ఆగర్భ శ్రీమంతుడైన మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూండగా.. ఎన్నికల అఫిడవిట్‌లోనూ పెద్దగా ఆస్తులు,. ఆదాయం చూపించలేని చెవిరెడ్డి భాస్కర్...

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే రేవంత్ ను ఓడించినట్లే !

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో విపక్షాల రాజకీయం రేవంత్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. ఆయనను దెబ్బకొట్టాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. సొంత నియోజకవర్గం అయిన మహబూబ్ నగర్ లోక్ సభలో ఓడిస్తే ఆయనకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close