వెంకన్న పాలకులకు వ్యాపారమే ప్రయారిటీ!

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వేంకటేశ్వరుని ధర్మకర్తల మండలి అంటే.. అందులో స్థానం సంపాదించుకోవడం కోసం.. ప్రధాని స్థాయిలో, రాష్ట్రపతి స్థాయిలో కూడా సిఫారసులు చేయించుకుంటూ ఉంటారంటే అతిశయోక్తి కాదు. వెంకన్న ధర్మకర్తల రూపంలో ఉండే హోదాకు ఉన్న గిరాకీ అలాంటిది. ఆ బోర్డులో చోటు దక్కగానే.. వేంకటేశ్వరుని భక్తుల సేవలో తరించడానికి తమకు భగవంతుడు అవకాశం ఇచ్చాడంటూ అందరూ స్టీరియోటైప్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. కానీ వాస్తవానికి దేవుని సేవ, లేదా భక్తులకు నిజమైన సేవ చేసేది ఎందరు? బోర్డు తీసుకునే నిర్ణయాలను గమనించినప్పుడు.. వారికి కేవలం వ్యాపార దృక్పథమే తప్ప.. సామాన్య భక్తులకు సేవ చేయడం ప్రాధాన్యం కానే కాదని అనిపిస్తుంది.

వివరాల్లోకి వెళితే.. వేంకటేశ్వరుని ఆర్జిత సేవలకు సంబంధించి.. టీటీడీ ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. ఆర్జిత సేవల టిక్కెట్లు సమస్తం ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించాలని నిర్ణయించారు. దీనివలన నేరుగా తిరుమలకు వచ్చేసి, అక్కడి బ్యాంకు క్యూలైన్‌లో నిల్చుని టిక్కెట్లు పొందాలని అనుకునే సామాన్య భక్తులకు ఆర్జిత సేవల టికెట్లు దొరకవు. ఆన్‌లైన్‌లో కొనగల సదుపాయం ఉన్నవారికి మాత్రమే సాధ్యం అవుతుంది. సామాన్య భక్తులకు కంటగింపు అయిన ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చినా.. వెంకన్న పాలకులు మెట్టు దిగలేదు. అయితే శుక్రవారం నుంచి మళ్లీ బ్యాంకు కౌంటర్‌ ద్వారా కూడా ఆర్జిత సేవల టికెట్ల విక్రయాలను ప్రారంభించారు. మళ్లీ భక్తులకు సదుపాయం ఏర్పడింది.

అయితే ఈ భక్తుల పట్ల సేవాభావం.. టీటీడీ పాలకుల్లో స్వతహాగా ఏర్పడింది కాదు. కేవలం ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే టికెట్లు విక్రయిస్తుండగా.. సరిగా బిజినెస్‌ కావడం లేదుట. కోటాలు పూర్తయ్యేలా టికెట్ల కొనుగోళ్లు జరగడం లేదుట. బిజినెస్‌ డ్రాప్‌ అయిపోయిందనే ఉద్దేశంతో తిరిగి బ్యాంకు కౌంటర్‌ ద్వారా విక్రయాలు ప్రారంభించారుట. మరీ దుకాణం పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వారి తరహాలో.. అన్ని రకాల భక్తులకు సమానంగా దేవుని సేవల అవకాశం కల్పించాలనే ప్రాథమి నీతిని పక్కనపెట్టి.. వ్యాపారంలాగా వ్యవహరిస్తున్న టీటీడీ బోర్డు నిర్ణయాల మీద ప్రజల్లో చాలా విమర్శలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close