ఖమ్మం బరిలో నామా వర్సెస్ తుమ్మల..! యుద్ధానికి పాత మిత్రలు సిద్ధం..!

తెలంగాణలో ఏ లోక్‌సభా నియోజకవర్గంపై లేనంత ఆసక్తి ఖమ్మం స్థానంపై ఉంది. అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను ప్రజాకూటమి అభ్యర్థులు గెలుచుకోవడమే కాదు.. దాదాపుగా లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని.. ఏడు నియోజకవర్గాల్లో కలిపి లక్షన్నర ఓట్ల మెజార్టీ వరకూ సాధించారు. దాంతో.. తెలంగాణలో మిగతా చోట్ల సంగతేమో కానీ… ఖమ్మంలో మాత్రం .. ప్రజాకూటమి అభ్యర్థి గెలుస్తారని…ఓ అంచనాకు వచ్చారు. అందుకే కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలంతా.. ఖమ్మం టిక్కెట్ కోసం… రేసులో ఉన్నామని ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. సహజంగా..ఆ స్థానాన్ని టీడీపీకి వదిలి పెట్టాల్సి ఉంటుంది. కూటమిని కొనసాగించాలనేది.. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం కాబట్టి… టీడీపీకి ఇచ్చే ఒకటి, రెండు పార్లమెంట్ సీట్లలో.. ఖమ్మం సీటు ఖాయంగా ఉంటుంది.

తెలుగుదేశం పార్టీ ఖమ్మం సీటు ఖాయంగా తీసుకుంటుంది కాబట్టి.. అక్కడ నుంచి పోటీ చేయగలిగిన ఒకే ఒక్క నేత నామా నాగేశ్వరరావు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయిన నామా… మొదటి నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికే ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ..అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో… ఖమ్మం బరిలో నిలబడాల్సి వచ్చింది. కానీ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఫెయిలవడంతో… ఓడిపోయారు. ఆ ఒక్క సీటే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ గెలిచింది. అదే ఇప్పుడు.. నామా నాగేశ్వరరావుకు కలసి వస్తోంది. ఇప్పుడు ఆయన లోక్‌సభ ఎన్నికలకు తన క్యాడర్‌ను సమాయత్తం చేసుకుంటున్నారు. కొద్ది రోజులుగా.. కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. రేపోమాపో.. ఎన్నికల ప్రకటన రానున్న తరుణంలో..కసరత్తు ముమ్మరం చేశారు. అనూహ్యంగా.. టీఆర్ఎస్ తరపున తుమ్మల నాగేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడంతో.. మంత్రి పదవి మిస్సయింది. ఇప్పుడు ఖమ్మం బరిలో ఆయనను దింపాలని.. కేసీఆర్ దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమ్మం సీటును గెలవాలనే పట్టుదలతో ఉండటంతో… నామాకు ధీటైన ప్రత్యర్థి ఆయనే అవుతారని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

నిజానికి తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు ఇద్దరూ.. ఖమ్మం రాజకీయాల్లో టీడీపీకి పెద్ద దిక్కుల్లా వ్యవహరించారు. అయితే..ఇద్దరూ… తమ ఆధిపత్యం కోసం… రెండు వర్గాలను మెయిన్‌టెయిన్ చేయడంతోనే సమస్య వచ్చింది. ఒకరి వర్గాన్ని ఒకరు ఓడించుకోవడానికి ప్రతీ ఎన్నికల్లోనూ ప్రయత్నించడం కామన్ అయిపోయింది. 2014 ఎన్నికల్లో కూడా ఒకే పార్టీ తరపున పోటీ చేసిన ఇద్దరూ ఓడిపోయారు. ఆ తర్వాత తుమ్మల టీఆర్ఎస్ లో చేరి మంత్రయ్యారు. కానీ నామా టీడీపీలోనే ఉన్నారు. ప్రత్యర్థులుగా మారారు. ఇప్పుడు ముఖాముఖి తలపడబోతున్నారు. అందుకే ఖమ్మం సీటుపై.. అందరి దృష్టి పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close