కోర్టుకు వెళ్లడమే తప్పంటున్న కేటీఆర్..!

“తప్పు చేయకపోతే తప్పుడు పిటిషన్లతో కోర్టుకు ఎందుకు వెళ్తున్నారు..” ఇదీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెట్టిన ట్వీట్. అసలు కేటీఆర్ ఈ వివాదంలో ప్రభుత్వ ప్రతినిధిగా స్పందిస్తున్నారా లేక పార్టీ ప్రతినిధిగా స్పందిస్తున్నారా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే, అసలు కోర్టులో పిటిషన్లు వేయడమే తప్పన్నట్లుగా చెబుతున్నారు. అవి తప్పుడు పిటిషన్లా, కరెక్ట్ పిటిషన్లా లేకపోతే ఇంకొకటా అన్నది కోర్టులు చెబుతాయి. కానీ అసలు కోర్టుకు వెళ్లడమే తప్పన్నట్లుగా కేటీఆర్ ట్వీట్లు చేస్తూండటంతో చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగలేదని, అన్యాయం చేస్తున్నారని భావించే ప్రతి ఒక్కరు న్యాయం కోసం కోర్టుల దగ్గరకు వెళ్తారు. న్యాయవ్యవస్థ ఉన్నదే అందుకు..! కానీ కేటీఆర్ మాత్రం అసలు పిటిషన్లే తప్పుడు అని తేల్చేస్తున్నారు.

ఐటీ గ్రిడ్ అనే కంపెనీ వ్యవహారంపై న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు అటు ఐటీ గ్రిడ్ కంపెనీ ఇటు ఏపీ ప్రభుత్వం, మరో వైపు తెలంగాణ పోలీసులు తమ డేటా చోరీ చేసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ లోపే కేటీఆర్ కోర్టుల్లో పిటిషన్లు వేయడం తప్పన్నట్లుగా ట్వీట్ చేశారు. ఆది, సోమవారాలు కోర్టులకు సెలవు కావడంతో శనివారం కోర్టు గడవు ముగిసిన తర్వాత పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీపై దాడి చేసి నలుగురు ఉద్యోగుల్ని తీసుకెళ్లిపోయారు. ఆ నలుగురి కోసం ఆ కంపెనీ యజమాని అశోక్ హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో తెల్ల కాగితాలపై వీఆర్‌వో సంతకాలతో పోలీసులు అడ్డంగా బుక్కయిపోయారు. వారిలో దురుద్దేశం ఉందని హైకోర్టు స్పష్టంగా అభిప్రాయపడింది.

ఐటీ గ్రిడ్ కేసు విషయంలో న్యాయనిపుణులు అనేక రకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కేసు తెలంగాణలో నమోదు చేయడానికి అవకాశమే లేదని చెబుతున్నారు. దానికి సంబంధించి స్పష్టమైన చట్టాలు ఉన్నాయని చెబుతున్నారు. అసలు డేటా చోరీ జరిగిందని నిర్దారించడానికి ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, ఏపీ డేటా చోరీ జరిగిందని చెప్పడమే న్యాయసూత్రాలకు అతకదని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ఐటీ గ్రిడ్ సంస్థ, ఏపీ ప్రభుత్వం, టీడీపీ న్యాయపోరాటం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో కోర్టులో పిటిషన్లు వేయడం తప్పన్నట్లుగా, ఆ పిటిషన్లు తప్పుడు పిటిషన్లు అన్నట్లుగా కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. కేటీఆర్ మాటలు టీడీపీ వర్గాలకు మరింత ఉత్సాహాన్నిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close