కొత్తగా చేరిన నేతలతో వైసీపీకి ప్లస్సా…? మైనస్సా..?

టీడీపీలో టిక్కెట్లు రాని వారంతా వైసీపీ వైపు చూస్తున్నారు. వారందర్నీ పిలిచి మరీ కండువా కప్పుతున్నారు జగన్. ఆ నాయకలతో పార్టీకి ఏమైనా లాభమా అంటే అంచనా వేయలేని పరిస్థితి. అమలాపురం ఎంపి రవీంద్ర బాబు టీడీపీ నుండి వైసిపిలో చేరిపోయారు. ఆయనకు టీడీపీలో సీటు ఇచ్చే అవకాశమే లేదని ముందుగానే తేల్చి చెప్పారు. ఫలితంగా రవీంద్రబాబు వైసీపీలో చేరిపోయారు. అయితే ఆయన ప్రజాబలం జగన్‌ను కూడా అబ్బురపరిచిందని, టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవని ఇప్పటికే వైసీపీలో ప్రచారం ప్రారంభమయింది. తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మొదుగుల టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతానని ప్రకటించారు. ఆయన పార్టీ నుంచి ఎప్పుడు పోతారా అని టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు.

అనకాపల్లి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పార్టీలో చేరేందుకు నాలుగు రోజులు ముందు కూడా చంద్రబాబును ఆకాశానికి ఎత్తి జగన్ ను బూతులు తిట్టారని అతన్ని ప్రజలు ఎలా నమ్ముతారని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు భీమిలిలో ఎక్కడా ప్రజాదరణ దక్కడం లేదని సోషల్ మీడియాలో వీడియోల సాక్ష్యంగా తేలిపోతోంది. అదే సమయంలో టీడీపీలో చేరుతున్న నేతలు మాత్రం బలంగా కనిపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరడంతో కర్నూలు పార్లమెంటుతో పాటు మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆ ప్రభావం ఉంటుంది. ఉగ్రనరసింహరెడ్డి చేరికతో కనిగిరిలో టీడీపీకి అడ్వాంటేజ్ వచ్చినట్లే. కాకినాడకు చెందిన చెలమలశెట్టి సునీల్, చేరబోతున్న కొణతాల రామక్రిష్ణ, కర్నూలుకు చెందిన గౌరు దంపతులు, సబ్బంహరి లాంటి నేతలు ప్రజల్లో పట్టున్న నేతలు.

రాజకీయంగా పేరుప్రతిష్టలున్న కుటుంబాలనుండి వచ్చిన వారు తెలుగుదేశంలో చేరుతున్నారు. పెద్దగా ప్రజాబలం లేదని టిక్కెట్ రాదన్న వారు వైసీపీలో చేరిపోతున్నారు. ఈ చేరికల ద్వారానే ప్రజల సెంటిమెంట్ ఏమిటో అర్థం చేసుకోవచ్చని టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close